శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
సర్వ విఘ్నోపశాంతయే
శుక్లమైన అంబరం పరిశుద్ద జ్ఞానమే. అది అంబరంలాగా సర్వ వ్యాపకం. విష్ణు వంటే వ్యాపకమైన తత్త్వమే. దాన్నే ఒక వస్త్రంలాగా ధరించాడా దేవత. మరలా దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతా డాయన. శశి అంటే చంద్రుడు, చంద్రుడంటే మనసనే చెప్పాము. మనో భూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్తోమత ఏమిటాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్యైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. అవి నిత్యమూ భుజించే అంటే అనుభవించే మహనీయుడు. కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో దాన్ని మనకు వదనం బోధించగలడు. ఆ బోధ నందు కుంటే అదే మనకు సర్వవిఘ్నో పశాంతయే సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది. దానితో ప్రాపంచికమైన గణములో చిక్కుపడిన ఈ మానవుడే గణపతిగా మారి గణపతి వినాయకుడై మహాగణపతి గా మారి చివరకు పితృ పైతామహమైన మోక్ష సామ్రాజ్యానికే పాత్రుడవుతాడు. ఇదీ మహాగణపతి మనకు చేసే అగణితమైన మహోపదేశం.
Page 78