#


Index

  కాని రఘు వంశంలో అంతమంది రాజుల కథలు చెప్పినా అందరిదీ కలిసి ఒకే కథ. అదేదో కాదు. పురుషార్ధ ప్రబోధమే. ఆదర్శంలో ఉంది ఐక్యం. దాని కనుగుణంగా ఎన్ని కథలల్లినా అవి ఆదర్శానికి వ్యాఖ్యానమే. అప్పుడు కథలలోని అనే కత్వ మడ్డు తగలదు మన దృష్టికి. ఈ దృష్టితో చూస్తే బ్రహ్మాండమైన వస్వైక్యముంది రఘు వంశంలో. కనుకనే “రఘూ ణామన్వయం వక్ష్యే” అని ముందుగానే చాటి చెప్పాడు మహాకవి. దీని అర్ధమేమంటే అన్వయంలో జన్మించిన రాజుల కథ కాదు నేను చెప్పటం. వారందరికీ చెందిన అన్వయ స్వరూపాన్నే చెబుతున్నానని. దీనిని బట్టి అన్వయ జాతులెందరైనా అన్వయం ఒక్కటే. ఆ వంశ లక్షణాలే వంశీయు లందరిలో వ్యక్తమౌతున్నాయి. ఈ దృష్ట్యా కావ్య వస్తువులో ఐక్య మెంతైనా చూడండి కనిపిస్తుందని కాళిదాసు మనకు చేస్తున్న మౌనోపదేశం.

  ఇదే అల్లసాని వారిది కూడా. అందుకే ఈపద్య మిలా వ్రాశాడాయన. అది ఎలాగా అని అడగండి. రఘువంశంలో లాగే నా కావ్యంలో గూడా పురుషార్ధా పదేశమే నా వివక్షితం. కథలు నాలుగింటిలో నాలుగు పురుషార్ధాలను క్రమంగా ప్రతిపాదించాను. ప్రవరుడి కథలో ధర్మం, గంధర్వుడి కథలో అర్ధం, స్వరోచి వృత్తాంతంలో కామం, స్వారోచిషుని ఉదంతంలో మోక్షం. మొదటిది ధర్మం చివరిది మోక్షం. రెండింటి మధ్యలో అర్ధ కామాలు. ఏమిటి దీని అంతరార్థం. ఆ ముష్మికమైన దృష్టులు రెండూ కలిసి ఐహికమైన జీవితాన్ని అదుపులో పెట్టాలి. ఆ ముష్మికాలు రెండింటిలో కూడా ధర్మమనేది కొంత వరకే. అది అభ్యు దయానికే. అంటే శ్రేయస్సుకే. నిశ్రేయసమైన మోక్షానికి గాదు. మోక్షమే పరమ పురుషార్ధం. దాని తోనే ముగుస్తుంది మానవుని జీవ యాత్ర.

Page 66