ఇందులో సకలా శాగతి అనే మాట- తెల్ల వారింది వెంటనే లేచి ఆయా దిక్కులకు వెళ్ళే వారంతా వెళ్ళండి అని పురుషార్ధాలలో అర్ధానికి సూచకం. నర్మ కోప విరతి అనే మాట ప్రేయసీ ప్రియులు మూతి బిగించుకొని పడుకోక ఒకరి నొకరు గాఢంగా కౌగిలించు కొండని కామ పురుషార్ధానికి సూచకం. మరి శ్రాత క్రియారం భణమనే మాట - ద్విజులైన వారందరూ వేదోక్తమైన కర్మలన్నీ యథావిధిగా అనుష్ఠించమనే ధర్మ పురుషార్ధానికి సంకేతం. కుక్కుట ధ్వని మీద నెపం పెట్టి కవి చూపుతున్న కావ్య ధ్వని ఇది. పైగా వర్గత్రయి అని చెప్పటంలో కవి వివక్షితం ధర్మార్ధ కామాలనే త్రివర్గ నిరూపణమేనని - త్రిభంగిన్ అనటంలో అది ధ్వని రూపంగా నా కావ్యంలో మీకు బయట పెట్టి చూపుతానని - కవి చేసే సూచనను మనం చక్కగా గ్రహించవచ్చు. వర్గత్రయీ అనే మాట వాచ్యంగా త్రివర్గాన్నే సూచిస్తున్నా వ్యంగ్యంగా అపవర్గమైన మోక్ష పురుషార్ధాన్ని గూడా మనసుకు స్ఫురింప జేస్తున్నది. శబ్ద జ్ఞానమే మూల మనటంలో శబ్ద ప్రమాణమైన వేదం ద్వారానే ఇది మానవుడు అందుకోవలసి ఉందని కూడా ధ్వనిస్తున్నది. ఇది కుక్కుట ధ్వనా ? లేక కావ్య ధ్వనా ? రెండూ. కుక్కుట ధ్వనిలో కావ్య ధ్వని. మొదటిది బాహ్యార్ధమైతే రెండవది తాత్పర్యార్ధం.
ఇది మనకు కథా ముఖంగా బోధించటమే కవి ఆశయం. పెద్దన తీసుకున్న కథలు నాలుగే ఈకావ్యంలో. 'రసస మంచిత కథలన్' అని ఆయనే బహువచనం ప్రయోగించాడు కావ్యాదిలో. దీని వల్ల వస్వైక్యం దెబ్బ తిన్నదంటారు చాలా మంది మను చరిత్రలో. అది తెలిసీ తెలియక ఆడే మాట. కథా బాహుళ్యం వల్లనే వస్వైక్యం దెబ్బ తినేటట్లయితే కాళిదాసు రఘువంశం కూడా తినవలసి వస్తుంది.
Page 65