కాగా ఇక అల్లసాని వారిది కూడా ఇదే బాణి. పురుషార్ధ బోధే ఆయన గారి ఆదర్శం కూడా. 'ఆతుల పురాణాగ మేతి హాసకథార్థ - అనే మాటలోనే సూచించాడది. నన్నయ గారి కథా కలితార్ధమేదో అదే ఈయన గారి కథార్థం' ఆదర్శం రసజ్ఞలకు అహితాన్ని పోగొట్టి హితాన్ని కలిగిస్తే దాన్ని బయటపెట్టే రచన చతురంగా సాగాలి. ఇదే పెద్దన ఉద్దేశం. అందుకే కలిధ్వం సకమూ, చతుర రచన అని రెండు మాటలలో ఈ రెండు రహస్యాలు బయట పెడతాడు. కలిధ్వంసన మనేది ఇందులో ప్రాత ఐతే చతుర రచన అనేది ప్రాతలో ఆయన చూపదలచిన క్రొత్త. ఇంతకు ముందే మనవి చేశాను. సృష్టి సామగ్రి ప్రాతదైనా సృష్టి క్రొత్తగా ఉండాలి అని. ఈ కళా రహస్యం కూడా పెద్దనగా రెంత సూక్ష్మంగా గుర్తించారో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వ్యంగ్యంగా దీన్ని ఎలా సూచించాడో చూడండి.
ప్రవరుడు హిమాలయ సానువులలో తిరుగుతూ దాని వైభవాన్ని ఇలా వర్ణిస్తాడు.
విలయ కృశాను కీలముల వేడిమి పోడిమి మాలి వెల్మిడిం గలిసిన భూతధాత్రి మరి క్రమ్మఱ రూపయి నిల్చియోషధుల్ మొలవగ జేయునట్టి నయముంబ్రతి కల్పమునెట్లు గాంచు నీ చలిమల వల్లనుల్ల సిలు చల్లదనంబును పూనకుండినన్.
ఈ పద్యం చూడబోతే కేవల మొక పర్వత సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్టు తోచదు మనకు. విమర్శించి చూస్తే హిమ వద్వర్ణన నెపంతో కవితా శిల్ప రహస్యాన్నే చెబుతున్నాడా అనిపిస్తుంది. ప్రళయ కాలంలో మాసిపోయిన భూత ధాత్రి ఏదో కాదు. పురాణే తిహాసా దివాఙ్మయం. అలాగే క్రమ్మర రూపయి నిల్చిందేదో కాదు. ఆ పురాణాది వాఙ్మయమే మరలా ఒక ప్రబంధ
Page 63