తుండనే మాటలో స్పష్టంగా వర్ణించాడు నన్నయ్య భట్టే ఆంధ్ర కవిత్వానికి పితామహుడని. ఈ విధంగా కవి బ్రహ్మ అనిపించుకొన్న తిక్కనా మాత్యుడే పెద్దన కంటే పూర్వుడైనవాడే పితామహ బిరుదాన్ని త్యాగం చేస్తూ ఉంటే పోయెరా బంగారమని దాన్ని రాయలం దివ్వటమేమిటి ? పెద్దన్న దాని నందు కోవటమేమిటి. పైగా ఎంతో గొప్పగా దాన్ని చెప్పుకోవట మేమిటి? ఇది ఏ మాత్రమూ యుక్తి యుక్తంగా లేదని తోస్తుంది. కాని కొంత లోతుకు దిగి చూస్తే గాని దాని చహరా ఏమిటో మనకు స్పష్టం కాదు.
కవిత్వ మనేది ఒక ప్రపంచమే. సందేహం లేదు. ప్రపంచానికెలా ఒక సృష్టి కర్త ఉన్నాడో దీనికీ అలాగే ఉన్నాడు. వాడు బ్రహ్మ అయితే వీడు కవి బ్రహ్మ. ' ది అసలు సృష్టి అయితే ఇది విశ్వా మిత్ర సృష్టి. అయితే ప్రపంచంతో దీని నెప్పుడు పోల్చామో దాని ప్రక్రియ అంతా దీనిలోనూ కనిపించి తీరాలి. ఈ చరాచర ప్రపంచం ఒక్క సారి సృష్టి అయి అంతటితో నిలిచిపోదు. కొంత కాలం వ్యవహారం జరిగిన తరువాత లయ మైపోతుంది. లయమైన తరువాత కొంత కాలానికి మరలా సృష్టి అవుతుంది. ఇలా సృష్టి - లయమూ - లయమూ - సృష్టి - ఒక చక్రం లాగా అవిచ్ఛిన్న వేగంతో పరిభ్రమిస్తూనే పోతుంది. అంచేతనే దీనిని జగత్తని సంసారమని సార్ధకంగానే వ్యవహరించారు మన పూర్వులు. ఐతే ఇలా లయమై మరలా సృష్టి జరిగేటప్పుడు సామగ్రి ఎక్కడిది అని ప్రశ్న వస్తుంది. ఎక్కడిదీ అనే ప్రశ్న లేదు. అంతకు పూర్వ మెక్కడిదో ఇప్పుడూ అక్కడిదే. పరమేష్ఠిలో శక్తి రూపంగా ఏదైతే ఉందో అదే వ్యక్త రూపంగా అవతరిస్తుంది. అవతరిస్తే ప్రపంచమన్నాము. అస్తమిస్తే శక్తి అన్నాము. ఇంతే తేడా. ఒకటి స్థూలం. మరొకటి సూక్ష్మం. సూక్ష్మమైన ఆ బీజ గర్భంలోనే ఇమిడి ఉంది ఈ చరాచర సృష్టి అంతా.
Page 59