ఆంధ్ర కవితా పితామహ - అల్లసాని
అల్లసాని పెద్దనను గూర్చి ఎంతోమంది ఎంతో పెద్దగా చెబుతూ వచ్చారు. అయినా ఇంకా చెప్పవలసిందేమిటో మిగిలిపోయిందనే నాబుద్ధికి తోస్తుంది. మను చరిత్ర తప్ప పెద్దన గారి కలం నుంచి వెలువడిన రచన మరి ఒకటి ఏదీ లేదనే చాలా మంది అభిప్రాయం, కొంత మంది అభిప్రాయ మా ముక్త మాల్యద గూడా ఆయన రచనేనని. అయితే ఈ వాదం తర్వాత విమర్శకులు చేసిన సింహనాదానికి తట్టుకోలేక పుట్టింది పుట్టినట్టే అంతరించింది. కాని ఏనాటికైనా నిజం నిరూపించ గలిగితే ఇలాంటి సింహగర్జనలకు కూడా బెదరనక్కర లేదు. నిరూపించగలమా అనేదే ప్రశ్న. నా వరకు నాకు ఆముక్త మాల్యదలో పెద్దన గారిచేయి ముప్పాతిక కద్దనే గట్టి నమ్మకం. ఇది రాయలంటే ద్వేషంతో కాని పెద్దన అంటే అభిమానంతో కాని ఆడిన మాట గాదు. పెద్దన కవితా తత్త్వమేమిటో చక్కగా అవగాహన చేసుకున్న మీదట అంటూ ఉన్నమాట. సందర్భం వచ్చినప్పుడీ సత్యాన్ని సవిస్తరంగా మనవి చేస్తాను. ప్రస్తుతాని కందరమూ నిర్వి వాదంగా ఒప్పుకొనే మను చరిత్రను గూర్చే మాటాడుకొందాము.
మను చరిత్ర అనేది నిజంగా లోకంలో మను చరిత్రే. కతికవయః * కతి కృతియః- కతిలుప్తాః- కతిచరంతి - కతి శిథిలాః- అని నీలకంఠ దీక్షితుడు కాబోలు అన్నట్టు జ్ఞాపకం. ఎందరు కవులు లేరు. ఎన్ని కావ్యాలు లేవు – ఐతే కాలావాహిని కెదురొడ్డి నిలువ గలిగిన వెన్ని. విలువ గలిగినదేదో అదే నిలువ గలిగినది. అలాంటి విలువ గడించుకొని మనుగడ గన్నదే మను చరిత్ర. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలముగా కుండునది
Page 55