ఈ ఉపమానాలన్నీ మనకు దైనందిన జీవితంలో నిత్యమూ ప్రత్యక్షమయ్యేవే. లౌకికమైన ఈ ద్రవ్యాలే ఒక లోకోత్తరమైన ఆదర్శంతో ముడిపెట్టి వర్ణించినప్పు డెంత గొప్పగా దర్శన మిస్తాయో చూడండి. మన మెంత అభిమానించినా ఈ సంసార సుఖాలు శాశ్వతం కావు. నశ్వరమే. పోతే అనశ్వరమైన దశ ఒక సాయుజ్యమే. కాబట్టి ఈ బుద్బుద ప్రాయమైన భోగాలకు ప్రాకులాడక శాశ్వతమైన ఆ మోక్ష సౌఖ్యాన్నే చూరలాడమని గొంతెత్తి చాటే ఈ ప్రబోధమెంత దీటైనదో సహృదయ హృదయైక వేద్యం. 'కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల'. ఎప్పుడు భోగ భాగ్యాలనను భవించాలనే ప్రతివాడికీ అభిలాష. అ సౌకర్యంపాలు గావాలని ఎవ్వడూ పాలుపడడు. కాని ఆడంబర జీవనం కన్నా నిరాడంబరంగా బ్రతుకు సాగించటంలోనే నిజానికెంతో సుఖమున్నది. సంతృప్తి ఉన్నది. సౌకర్యానికి ప్రాకులాడటం ఒక ప్రయాస. అది ఫలించక పోతే ఒక పరితాపం. అలాంటి ఈతి బాధలిందులో లేవు. పైగా ప్రకృతి దత్తమైన పరికరాలివి. వీటిని సమకూర్చుకోవటంలో మానవుడికి ప్రయత్నమంటూ లేదు. అయినా తృప్తి లేక మానవుడు ప్రయాస పడటానికే సిద్ధమవుతాడు. ఎంత అవివేకులో గదా ఈ పంచజనులని ప్రగాఢమైన నిర్వేద భావం గోచరిస్తుంది ఇందులో.
35. ఇలా ఉదాహరిస్తూ పోతే ఇదీ ఒక మహా సముద్రమే. పారం చేరుకోలేము. మొత్తం మీద భూమికా చతుష్టయ విశిష్టమైన దీశివతత్త్వం. ఇదే సాహిత్య నిర్మాణాని కంతటికీ ప్రయోజనం. ఈ లక్ష్యాని కభిముఖంగానే సత్య సౌందర్యాలనే మిగతా రెండూ
Page 53