#


Index

వామనుడు పెరిగి త్రివిక్రముడవుతూ పోయే దృశ్యమిది. ఆయన మూర్తి ఇంతై అంతై ఎంతయిందో చెప్పవలసి వచ్చింది. ఏమని చెప్పాలి. ఎలా చెప్పాలి. ఎలా చెబితే మనస్సు కద్భుతమైన ఆ విగ్రహం సాక్షాత్కరిస్తుందో అలా చెప్పాలంటే సామాన్యం కాదు. అయినా మహాకవి దాని నెంత అనన్యాదృశంగా తనమాటల రంగులతో చిత్రించి చూపుతున్నాడో చూడండి. స్వామి వారు అంతంతకు పెరిగి పోతుంటే సూర్య మండలం ఆయనకు ఛత్రం గానూ శిరోరత్నంగానూ కంకణం గానూ కనిపిస్తూ చివరకు కాలికి పెట్టిన అందెగామారి ఆ తరువాత దానికి కూడా నోచుకో లేదంటాడు కవి. అంత మండలాన్ని ఛేదించుకొని ఆ దివ్యమంగళ విగ్రహం పైకి పోయేకొద్దీ మండలం దాని కన్నా క్రిందికి జారుతూ ఉంది. అప్పటికా విగ్రహమెంత పెరిగిందో దాని రూపరేఖలే పాటివో అంచనా వేస్తూపోతే భావుకుడి మనసు కెంత బ్రహ్మాను భూతి కలుగుతుందో తిలకించండి.

31. ఇలాంటిదే ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణంలో ఒక పద్యముంది. అదీ ఇంత హృద్యమైన పద్యమే. 'భవ దురునాభి శక్యమే'

వరగర్వితుడైన హిరణ్యకశిపుడి బాధలు పడలేక విష్ణువుతో మొర పెట్టుకోవటానికి దేవతలంతా పాలకడలికి బయలుదేరిపోయారు. అక్కడ శ్రీ మహా విష్ణువును దర్శించి ఆయన నిలా స్తోత్రం చేయసాగారు. మహానుభావా నీనాభి రంధ్రం నుంచి ఒక కమలం-ఆ కమలంలోని అనేక పరాగకణాలలో ఒక కణం పాకానికి వస్తే దానిలో నుంచి ఒక బ్రహ్మ ఆ బ్రహ్మ మనసులోని అనేక

Page 49