#


Index

అందులో మొదటి మజిలీ మనకు బాహ్య సౌందర్యమే చూపుతూ పోయింది. రెండవది బాహ్యం నుంచి మనలను క్రమంగా మానవుడి ఆంతర్యమైన భావ ప్రపంచంలోకి తీసుకొని పోయింది. అందులో పారవశ్యం చెంది పడిపోకుండా అంతకన్నా ఉన్నతమైన నైతిక శిఖరాన్ని చేర్చింది అభ్యుదయ మనే మూడవమజిలీ ప్రస్తుత మీ నాలుగవదా శిఖరాంచలాల మీదినుంచి ఇంకా పైకి లేపి సకల దిశావ్యాపకమైన అనంతాకాశంలోకి చేర్చి అక్కడ మనహృదయాని కొక అచ్యుతమైన స్థానాన్ని సమకూర్చు తున్నది. మొదటి మూడింటిలో మనం వరుసగా సాధించిన కుతూహలం - ఆవేగం - శమం - అనే అనుభూతులిక్కడ రాశీ భూతమైన ఒకొనొక విశ్వ జనీనమైన మహావిభూతిగా దర్శన మిస్తుంది. ధార్మిక స్థాయిని కూడా అతి క్రమించిన తాత్త్విక స్థాయి ఇది. ఇక్కడే కవి నిజమైన క్రాంత దర్శి అనిపించుకొనేది. ధార్మిక స్థాయిలోనే అలాంటి దర్శనం కొంత సమకూడుతుంది. అది ఇక్కడ అడుగుపెట్టే సరికి పరిపూర్ణ మవుతుంది. దేశ కాలాద్యవధులను దాటి చూచే కౌశలమే క్రాంత దర్శనం. దానితోనే కవి ఋషి కల్పుడవుతాడు. ఋషిత్వమంటే ఈ దర్శనమే. ఉదాత్త గంభీరమైన ఈ దృష్టికి సృష్టి రహస్యాలన్నీ కనుల ముందు పరిచినట్టు ప్రకాశిస్తాయి. భాసిస్తాయి. కనుకనే ఆలంకారికులు దీనిని శక్తి అని ప్రతిభ అని కూడా పేర్కొంటారు ఈ క్రింది వర్ణన ఆకర్ణించండి ఎంత ఆశ్చర్యధుర్యమో. 'రవి బింబంబు పమింప నిండుచో

Page 48