#


Index

ఇద్దరూ తమ గతి భేదంలోనే గావించిన ఈ పరస్పర సంభావనకు మురిసిపోయిన ఆ దంపతులు చిరునవ్వుతో ఒకరి వైపొకరు చూచారంటాడు కవి. అందులోని చాతుర్యానికి మెచ్చారట. సత్య మెచ్చట మలా ఉంచి కృష్ణుడు మెచ్చా డనటంలో ఒక ధ్వని ఉంది. గరుడుడి వ్యవహారం చూస్తుంటే తన అన్న గారు బలరాముడి విషయంలో తాను పాటించే వ్యవహార మాయన మనసుకు వచ్చి ఉంటుంది. సందేహం లేదు. అంతేకాదు. తరువాత కొద్దిసేపటిలో తాను అమరావతి చేరబోతున్నాడు. అక్కడ ఒక అన్న ఉన్నాడు తనకు దేవేంద్రుడు. తాను ఉపేంద్రుడు మాత్రమే. కనుక ఆ అన్న గారి పట్లతాను చూపవలసిన మర్యాద కూడా ముందుగా అయన మనసుకు తోచవచ్చు. ఇలా ఎన్నో లోతైన భావాలు కూడా ధ్వనిస్తున్నా యిందులో. చూడండి గరుత్మ దనూరుల సోదర మైత్రి సభినందిస్తూ నంది తిమ్మన వర్ణించిన ఈ వర్ణనలో అన్నదమ్ముల అన్యోన్యత అంటే ఎలా ఉండాలో మనబోటి లోకులకెలా ఒక గొప్ప ధార్మిక సందేశ మందజేస్తున్నాడో. ఇలా దర్శిస్తూ పోతే ఎంతైనా విశాలంగా గోచరిస్తుందీ అభ్యుదయ రంగం. పర్వత శిఖరాల లాగా అక్కడక్కడ మన కవి నేత్ర పర్వంగా సాక్షాత్కరిస్తాయి కళాదీక్షితులైన మహాకవుల మాటలలో.

30. పోతే ఈ అభ్యుదయ భూమికను కూడా దాటిపోయిన మరొక భూమిక ఉంది. అది తృతీయమైతే ఇది తురీయం. వేదాంతంలో తురీయావస్థలాంటి దిది. తురీయమక్కడ ఆఖరి దయినట్టే ఇక్కడా ఇది ఆఖరిదే. ఆఖరిదై అది మొదటి మూడు దశాలనూ వ్యాపించి ఉన్నట్టే ఇదీ మూడింటినీ వ్యాపించి ఉంది. కనుకనే దీని కభివ్యాపకమనే అన్వర్థ సంజ్ఞ ఏర్పడింది. అభిరుచి మొదలుకొని సాగింది మన ప్రయాణం.

Page 47