"గాండీవ జ్యారవంబు మూర్ఛిల్లకుండ ఇది తిక్కన ఉద్యోగ పర్వం లోని పద్యం. సంజయుడు రాయబారం వచ్చి మొదట తమ్ములను పొగడి తరువాత వెంటనే కౌరవు యోధులను పొగుడుతూ వ్యంగ్యంగా తమరిని బెదిరించే మాటలు మాటాడినపుడా మాటలలోని బెదిరింపును గమనించి మండిపోయిన ధర్మజుని మాటలివి. పైకి సాత్త్వికుడుగా కనపడుతున్నా లోలోపల దాగి ఉన్న ధర్మరాజు భయంకర స్వభావాన్ని ఎలా బయటపెడుతున్నదో చూడండి ఈ పద్యం. అలాగే " ఏమీ పార్థుడు నీవు పెంపఱు" అనే ఈ పద్యం చూడండి. ఇది శ్రీ కృష్ణుడు రాయబారం చేయబోతూ భీముడిని ఏమి చెబుతావని అడిగి - అతడు సంధికే ప్రయత్నించమని చెబితే - ఇదేమిటి చచ్చు మాటలివి భీమసేనుడి మాటలేనా అని బావగారు తనతో చదురు లాడితే ఆ సారస్యాన్ని గ్రహించి తానూతూకం గానే జవాబిచ్చిన భీముడి మాటలివి. మీరంతా నడుంకట్టి రంగంలో దిగి ఘనవిజయం సాధిస్తుంటే మేము కాదన్నా మా. పెద్దమిత్తెక్కి ఒక ఉత్సవాన్ని చూచినట్టు చూచి పొంగిపోమా. ఇలా పనిలేక పోతే మాకూ మంచిదే గదా. ఇలాంటి కవ్వింపు మాటలకు కదిలిపోయే వాడు కాదు భీముడంటాడు. చూడండి ఆ పద్యం చదివేటపుడు ధర్యరాజు మూర్తిని దర్శించటానికే భయపడతాము. మరి ఎప్పుడూ భయపడే భీముడి స్వరూప మీ పద్యం చదివినంతసేపూ మనకెంతో సౌమ్యంగా దర్శనమిస్తుంది. ఇలా సందర్భోచితంగా స్వభావ వినిమయం చేసి వర్ణించినా ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు మహాకవులు. దానిలో మానవుల స్వభావంలోని లోతులు తడమిచూచేకొద్దీ ఎంత వై చిత్రి ఉందా అనే ఆశ్చర్యమూ అంతకంత కభి నివేశమూ ఎక్కువవుతుంది సహృదయుడికి.
Page 42