ఆవిడ మనోరథాన్ని మన్నించలేదు. దానితో భగ్న మనోరధ అయి ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. ఈ విలాపమే కౌముదీ వృత్తాంతంలో కూడా కనిపించిందా కవికి. నలుపు తెలుపు చేయటం గంధర్వాదులందరినీ ఆకర్షించగలగటం. నీడ మాత్రం తెలుపు చేయలేక పోవడం ప్రవరాఖ్యుణ్ణి ఆవర్ణించ లేకపోవటం. తన్మూలంగా తుహిన బాష్పాలు రాల్చటం వరూధిని శోకంతో కన్నీరు కార్చటమే. ఈ విధంగా కావ్యనాయికా వృత్తాంతమే కౌముదీ వర్ణనా ప దేశంతో కవి చేశాడు అని భావుకుడి కనిపిస్తుంది.
25. అంతేకాదు. కావ్య పరంగానేకాక లోకపరంగా కూడా ఈ పద్య భావాన్ని మన మన్వయించుకోవచ్చు. లోకంలో ఒకానొక మహాత్ము డుంటాడు. వెన్నెలలాగా సౌమ్యమైన ఉదాత్తమైన స్వభావ మాయనది. తన చుట్టూ జరిగే దారుణాలను చూచి సహించలేక ఆయన తనతోడి మానవుల తామస స్వభావాన్ని సాత్త్వికంగా మార్చటాని కెన్నో విధాల బోధ చేస్తాడు. ఎంతగానో సంస్కరించాలని ప్రయత్నిస్తాడు. కాని కొందరే ఆయన సందేశాన్ని అందుకొని బాగుపడతారు. మిగతా ప్రజానీకమంతా ఎప్పటిలాగే పరమనీచంగా ప్రవర్తిస్తుంటారు. అయ్యోవీరిని మాత్రం నేనేమీ మార్చలేకపోయానే అని ఆ సాధువు హృదయ మెంతగానో బాధపడుతుంది. దానితో అప్రయత్నంగా ఆయనకనుల నుంచి బాష్పకణాలు రాలినా ఆశ్చర్యం లేదు. ఆయన ఒక బుద్ధుడే అనుకోండి. ఇలాంటి మహనీయుని జీవిత వృత్తాంతం కూడా తొంగిచూస్తున్నదీ వర్ణనలో.
Page 40