తన్ని మిత్తంగా దుఃఖబాష్పాలు స్రవించిందీ లేదు. నేత్రాలుంటే గదా బాష్పాలు స్రవించటానికి. అయితే ఏమిటి దంతా. ఇదంతా కవి కల్పించిన మహేంద్ర జాలం. కవి ప్రౌధోక్తి సిద్ధమని ప్రాచీనులు చాటించిన మాట కిదే అర్థం. చేతనో చితమైన వ్యవహార మ చేతన ప్రకృతి కారోపించి ఒక భావాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణన మూలంగా మన కది ఒక అచేతన మనే భావం తాత్కాలికంగా మనసుకు రాదు. చేతనులైన మనబోటి మానవుల చరిత్రే తలపున బాఱుతుంది. వారి అనుభూతితో మనకు సానుభూతి ఏర్పడుతుంది.
24. చూడండి. ప్రస్తుత పద్యంలో కవి వెన్నెలనే వర్ణిస్తున్నా అర్థాన్ని కొంచెం భావన చేస్తే మనకందులో మను చరిత్ర లోని ఒక పాత్ర వృత్తాంతమే కన్నులకు కడుతుంది. ఆ పాత్ర ఎవరో గాదు. వరూధిని. ప్రవరుడు వరూధినిని నిరాకరించి పోయిన తరువాత ఆమె దీనస్థితిని ఎంతగానో వర్ణించాడు కవి. ఇంతలో చంద్రోదయ మయింది. చంద్రికలు నలుదెసలా జాలువారాయి. అందులో కూడా కవికి వరూధిని దైన్యమే దర్శన మిచ్చింది. దానినే తాను వ్యంగ్యంగా మాటలతో చిత్రించి ఆ చిత్రాన్ని మనకూ ప్రదర్శిస్తున్నాడు. ఎలాగా అని అడగవచ్చు. వెన్నెల వరూధినే. వెన్నెల లాగా అచ్చమైన మచ్చలేని ప్రకృతి ఆవిడది. ఎందరో సురగరుడోరగ గంధర్వాది కుమారులను కూడా అంతవరకూ కన్నెత్తి చూడలేదా అచ్చరకన్నె. అలాంటిదే దైవశక్తి చేతనో చూచీ చూడటంతోనే ఆ విప్రవరుణ్ణి వరించింది. కోరిక తెలిపింది. బ్రతిమాలింది భంగపోయింది. చివరకు బలవంతం కూడా చేసింది. అయినా ఆ కఠినహృదయుడి మనసు కరగలేదు.
Page 39