#


Index

22. మరొక సందర్భంలో మరొక మహాకవి వ్రాసిన పద్యం తిలకించండి. వాసో నిగ్రహ మెన్న రాఁకలియు నీర్వట్టుం దలంపర్తలల్ మాసెంగా యన-రంగముల్ బడలినం బాటింప - రట్లుండనీ ఆ సాయంబును నా నిశాత్యయముగా - నామ్నాయముల్ గ్రోల్చుచో నా సీన ప్రచలాయితం బయిన లే - దాహావితర్కింపఁగE” ఇవి అగస్త్య మహర్షి మాటలు. ఎవరితోనో అన్నవి గావు. తనలో తాను అనుకున్న మాటలివి. ఎవరిని గూర్చి. తన శిష్యులైన అయుత నియుతులను గూర్చి. వారు తన శిష్యులైనా అలాంటి ఇలాంటి శిష్యులు గారు. అంత శ్రద్ధా భక్తులతో చదువుకొన్న విద్యార్థులే ఎక్కడా కానరారు. మనకు గాదు. అగస్త్యునిలాంటి తీక్ష స్వభావుడికే ఆశ్చర్యం కొలిపింది వారి విద్యాభ్యాస దీక్ష. పండగనాడు కూడా కొత్తగుడ్డలు కుట్టించలేదని పేచీ పెట్ట లేదా కుఱ్ఱవాళ్ళు. ఆకలి దప్పులని కూడా అనుకోలేదు. తలకాయలు మాశాయి సీకాయ లేదా అని అడగలేదు - తుదకు శరీరాలు ఓర్చకున్నా సొటసొటలు పోలేదు. మరి పగలు రాత్రి అని లేకుండా గురువు గారు వేదమంత్రాలు బోధిస్తుంటే కాదనకుండా వల్లిస్తూనే ఉన్నారు. అలా వల్లించేటపు డల్పాచమన మని అయినా చెప్పి బయటికి వెళ్ళి వచ్చే బాపతు కాదట. ఏమిటీ వర్ణన. విద్యార్జన చేయటాని కెంత దీక్ష ఉండాలో - గురుభక్తి ఎంతగా పాటించాలో - అలాంటి వారి పట్ల సద్గురువులైన వారికెలాంటి వాత్సల్యమో - తల్లి బిడ్డలను మరిపించే వారి పరస్పర స్నేహానుబంధ మెలాంటిదో ఎన్ని భావాలో ఈ పద్యం చదివితే మన మనసులను గిలిగింతలు పెడతాయి.

Page 37