మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రధంతే' శాస్త్రాని కాదిలోనూ మధ్యలోనూ అంతంలోనూ మంగళాన్ని నిబంధించాలి. అప్పుడే ఆ శాస్త్రం రాణిస్తుందని చాటారు. మంగళమంటే శివానికి మారుపేరే. ఇది శాస్త్రాని కెలాగో కావ్యానికి కూడా అలా అపరిహార్యమే. కావ్యం ఆదిలో ఇంకా కథారంభం కాకముందు కవి చెప్పిన మాటలన్నీ శివకరంగానే ఉండాలి. మధ్యలో కధా సన్నివేశాలన్నీ తన్మయంగానే సాగాలి. చివరకు కావ్య రచన ముగిసే సందర్భమంతా శివాంతంగానే సమాప్తం కావాలి. అప్పుడే కావ్య నిర్మాణ మంతా ఎంత బహుముఖంగా నడిచినా అన్నింటికీ కలిపి ఏకవాక్యత అనేది సిద్ధిస్తుంది. అస లొకకవి కావ్యం రచించాడంటే ఎందుకు రచించినట్టు దాని వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగితే జవాబు చెప్పాలి గదా. ' ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే' ప్రయోజనంలేని పని ఎంత మూఢుడు కూడా చేయ బోడు. అలాంటప్పుడింత పెద్దకార్య భారం పని లేక ఎట్టుకున్నాడా మహాకవి. దాని కేదో ఒక మహోద్దేశమే ఉండితీరాలి. అది శివం కాక మరేమిటి. తాను రచించే కావ్యం ద్వారా తనకూ తనచుట్టూ బ్రతికే లోకానికీ సర్వవిధాలా హితకారి అయి ఉండాలది. పురోగతికి తోడ్పడేదిగా ఉండాలి. అలా దోహదం చేయకపోతే మనకు లౌకిక మైన జీవనమే చాలు. సాహిత్యం వరకూ పోనక్కరలేదు. సాహిత్యమనేది ఈ సృష్టికి కవి బ్రహ్మ చేసే ప్రతి సృష్టి. సృష్టిలో మనకు కరవైన శాంతి సౌఖ్యాల కొఱత తీర్చటానికి ఈ ప్రతి సృష్టికి కవి పితామహులు పూనుకొన్నారు. అలాంటి శపథం చేసి సృష్టించిన ఈ కావ్యసృష్టిలో కూడా మనకా భావం అందని మ్రాని
Page 29