#


Index

కవి ఈ అంచులపైన ప్రయాణం చేస్తే అధ: పాతాళంలో పడి పోయే ప్రమాదముంది. అంచేత ' స పురస్కృత మధ్యమ క్రమః ' అని మహాకవి వర్ణించినట్టుగా మధ్యే మార్గాన్నే పట్టుకొని పోవాలి. ఏమిటా మధ్యను మార్గం ! ఒక స్మరణీయమైన అర్ధాన్ని రమణీయమైన మార్గంలో పొదిగి మనకు ప్రదర్శించటం. ఇలాంటి భావరచనా సామరస్యమే పునః పునరను సంధానాత్మకమై లోకోత్తరమైన రసానుభవాన్ని సహృదయలోకానికి ప్రసాదిస్తుంది.

10. తిక్కన గారి ఈ వర్ణన చూడండి ప్రస్తుతం చెప్పుకొన్న సూత్రానికెలా అద్దం పట్టి చూపుతున్నదో.

"యమమహిష ఘంటికా నా దము వినఁగౌతూహలంబు దళుకొత్తెడు. చి త్తములు గల కౌరవుల - కి ష్టములగునే సంధి కార్య శాంతి వచననముల్ |

రాయబారానికి పోయే సమయంలో ద్రౌపది శోకో ద్రేకాన్ని ఉపశమింప జేసే వాసు దేవుని నోట వెలువడిన మాటలివి. దుర్యోధనాదు లతి మూర్ఖ స్వభావులు. తన మాట లెలాగూ వారు ఆలకించబోరు. అవి వారి చెవులకు శూలాయమానాలు. ఎలాగూ భారత యుద్ధం తప్పదు. అందులో దుశ్శాసనుడు చిత్రవధ పాలవుతాడు. దుర్యోధనుడు తొడలు విఱిగి నేల గూలుతాడు. అదే గదా ద్రౌపదికి కావలసింది. అలాంటి దారుణ పరిణామం కన్నారగాంచితే గాని ఆవిడ ఉడుకు చల్లారదు. మరి సంధి ప్రయత్నం సఫలమైతే అది ఎలా సంభవం. సర్వజ్ఞుడైన శ్రీ కృష్ణుని కది తెలియనిది కాదు. కనుకనే అతడంటున్నాడు.

Page 24