8. ఈ దారిలో నడుస్తూ పోతే మన మెంత దూరమైనా నడవవలసిందే కాని గమ్యం చేరలేము. ఇంతకూ సారాంశ మేమంటే సౌందర్య శబలితం గాని భావం ఒక శుష్కమైన సమిధ లాంటిది. దాని కొక దీప్తి వ్యాప్తి లేదు. అట్లాగే ఒక విశిష్టమైన భావమాలంబనం గాని సౌందర్య సృష్టి కూడా అపేక్షణీయం కాదు. అది ఒక శవానికి చేసే శృంగారంలాగా అమంగళమే అనిపించుకొంటుంది. శరీరానికి ప్రాణమెలాంటిదో రచనకు భావమలాంటిది. భావ సంపదలేని కేవల రచనా సౌందర్యం కవి నేర్పునే ప్రకటిస్తుంది గాని హృదయాన్ని కదలించలేదు. మన సాహిత్యంలో ఉత్తరాంధ్ర యుగానికీ - క్షీణ యుగానికీ చెందిన రచనలన్నీ చాలా వరకీ కోవకు చెందినవే. మాటల పోటీలో వాళ్లెంత ముందంజ వేశారో మధురమైన భావనలో అంత వెనక్కు తగ్గారు.
నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక ఇలాంటి రచన లే ర సజ్ఞులను నవ్వించటానికో | ఏ మంద మేమి సేయుద మేమందని మందలింత మేమందమొ !
ఇందులో భావమైతే ఉంది గాని దానిని నిలువునా దిగ మ్రింగేంతటి సౌందర్య సంపాదనా సంరంభం కనిపిస్తూ ఉంది కవికి. ఇలాంటి రచనలెన్నో కుప్ప తెప్పలు మన సాహితీ సామ్రాజ్యంలో.
9. కాబట్టి మనం గమనించవలసిందే మంటే అసుందరమైన భావమెలా ప్రశంసనీయం కాదో భావ బంధురం కాని సౌందర్యం కూడా అలాగే అభినందనీయం కాదు. రెండూ రెండు అపాయకరమైన అంచులు.
Page 23