ఇది మంచి పద్యమే. ఒక మంచి సుభాషితమే చెబుతున్నది. సందేహం లేదు. అయితే అది అంత వరకే. ఒక జీవిత సత్యం చెప్పటం వరకే దాని జీవితం ఆగిపోయింది. ఆ చెప్పటంలో ఒక చెప్పుకోదగిన అందమేదీ కానరాదు. ఏ అలంకరణా వేషధారణా లేకుండా పాత్రలు ఒక దాని వెంట ఒకటి రంగంలోకి వచ్చి వెళ్లినట్టుగా వెళ్ళుతున్నాయి భావాలన్నీ. అదే మరో పద్యం చూడండి.
అల్పుడెపుడు పలుకు నాడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ! వినుర ! వేమ -
ఇది కూడా ఒక గొప్ప సత్యాన్ని చెప్పే పద్యమే. అయితే ఇది దాన్ని ఊరక ఏకరువు పెట్టటం లేదు. చెప్పటంలో ఒక అందమూ, చందమూ ఉంది. అది కంచు - కనక మనే రెండు ఉపమాన ద్రవ్యాలను కొని తేవటం ద్వారా వ్యక్తమవుతున్నది. ఆడంబరంగా పలకట మంటే ఏమిటో చల్లగా మాటాడటమంటే ఏమిటో ఎలా ఉంటుందో మాటలతో చెప్పలేని అనుభూతి నివి మౌన భాషలోనే మన కందిస్తున్నాయి.
ఒక కవి సమర్ధుడయిన కొలదీ ఈ అందాన్ని తన రచనలో అనేక మార్గాల సాధించగలడు. అలంకారంలోనే గాదు. శైలిలోనే గాదు ఛందస్సు లోనే గాదు ఆఖరు కొక మాటనేర్పులో కూడా సాధించగలడు. ఇవైనా ఏదో స్థాలీపులాక న్యాయంగా పేర్కొన్న మార్గాలు. 'ఒక్కొక్క మార్గంలో మరలా ఎన్నో మలుపులూ తిరుగులూ ఉండవచ్చు. వాటికిక అవధులంటూ లేవు. ప్రౌఢుడైన కవి
Page 20