వృత్తం. ఇతి వృత్త మన్నా వృత్త మన్నా వస్తువన్నా - కథ అన్నా సామగ్రి అన్నా - అన్నీ ఒక దాని కొకటి అన్నదమ్ములే. ఇంతకూ సామగ్రి లేకుంటే రచన లేదు. రచన లేదంటే ఫలసిద్ధిలేదు. మూడింటికీ ఉన్న ఈ సాహచర్యం మూలాన్నే సాహిత్య మనే నామధేయం సార్థక మయింది. ప్రకృష్ణ మయిన బంధం కావటం మూలాన ప్రబంధమయింది. దీనిని సాధించట మొక్కటే కవికున్న వ్యాపారం కాబట్టి ఇది చివరకు కావ్యమయింది.
5. దీనిని బట్టి సాహిత్య ప్రక్రియలో వీటి మూడింటికీ మధ్య ఉన్న ఒక గొప్ప సామరస్య మేమిటో ఇప్పుడు మనకు బాగా తేటపడుతున్నది. అదేమిటంటే కేవలమొక సత్యాన్ని ఉన్న దున్నట్టు ఏకరువు పెట్టి నంత మాత్రాన అది సాహిత్యం కానేరదు. ఏ భావాన్ని వర్ణించినా అది సుందరంగా హృదయంగ మంగా వర్ణించాలి. మరి ఎంత రమణీయంగా వర్ణించినా అందులో భావ మనేది కరవైతే మరలా ప్రయోజనం లేదు. దానికాధార పీఠమైన వస్తువు కూడా ఒకటి చోటు చేసుకొని ఉండాలి. భావ సంపదలేని సౌందర్యం నేల విడిచిన సామయితే - సౌందర్య స్పర్శలేని భావ మొక చవీ - సారంలేని భోజనం. ఈ క్రింది పద్యాన్ని చూస్తే మీకీ సూత్రార్థం బోధపడుతుంది.
“ఏఱకుమీ కసుగాయలు దూఱకు మీ బంధుజనుల - దోసము సుమ్మీ పాఱకు మీ రణమందున మీఱకు మీ గురుల యాజ్ఞ మేదిని సుమతీ”
Page 19