మనలో ఉన్న పశు మృగ లక్షణాలన్నారే అవి ఎక్కడ ఉన్నాయని అడగ నక్కరలేదు. ఉపేక్షిస్తే ఆగుణాలే పైకి వచ్చి మనకు దర్శన మిస్తాయి, అవి మనలో ఉన్నా వాటి కంటే అదనంగా విచారణా శక్తిని ఇచ్చి సృష్టించాడా ఈశ్వరుడు. ఎవరికేది అతిశయంగా ఇచ్చి ఉంటాడో అదే దానికి పరిపూర్ణత. అందు కోసమే అది ఏర్పడి ఉంటుంది. దీనికొక ఉదాహరణ ఇస్తాను వినండి. గుర్రం గాడిద కన్నా ఉత్కృష్టమైనది. ఎందుకంటే గాడిద బరువులు మోయటానికే సృష్టి అయింది. గుర్రమలా కాదు. అది పరుగెత్త గలదు. బండికి కడితే లాగ గలదు. ఆట నేర్పితే ఆడగలదు. యుద్ధ రంగంలో సైనికుడికి తోడ్పడగలదు. ఇంతేకాక గాడిద లాగా బరువు కూడా మోయగలదు. ఎప్పుడైనా ముందు చెప్పిన విశేష గుణాలు దానిలో లోపించాయో. అప్పుడది కేవలం బరువు మోసే గాడిద స్థాయికే దిగజారుతుంది, అది దాని వ్యక్తిత్వానికే ఒక గొడ్డలి పెట్టు. అలాగే ఆహార నిద్రాభయమైధు నాదులనే జంతు లక్షణాలు మీ నవుడిలో ఉంటే ఉండవచ్చు. వాటికంటే విశేషంగా ఆలోచనా గుణ మొకటుంది. దానికి పనిచెప్పినప్పుడే అతడు మానవుడని పించుకోగలడు. లేకుంటే మెత్తబడ్డ గుర్రంలాగా తానూ సంసార భారం మోయటానికే తప్ప మరి దేనికీ పనికిరాడు.
ఇంతకూ మానవుడంటే బుద్ధి జీవుడని అర్ధం. ఈ బుద్ధి అనేదే పశు పక్ష్యాదుల కంటె అతనికి అదసంగా ఉన్న లక్షణం. అది లేనిది గనుకనే మిగతా జీవ జాలమంతా జ్ఞానానికి నోచుకోలేదు. బుద్దికి చెందినదే జ్ఞానం. ఈ జ్ఞానంలో కూడా రెండతస్తులున్నాయి. మొదటిది లోకులందరికి అవగాహనకు వచ్చేది. రెండవది కొందరికి మాత్రమే అనుభవానికి వచ్చేది. మసం లోకంలో నేర్చే సమస్త విద్యలు, కళలు, వృత్తులు మొదటి శ్రేణికి చెందినవి.
Page 119