#


Index

  అంచేతనే చాల సున్నితమైనది, ఎప్పుడు ఏ ప్రమాదానికి గురి అయినా కావచ్చు. అంచేత తన్ని వారణార్థం తన కున్న పరివారాన్నే తాను చక్కగా ఉపయోగించుకో గలిగి ఉండాలి. ఒక మహా రా జెలాగైతే పరిపాలనా భారమంతా చాలా వరకు యుగంధరుడి లాంటి ఆమాత్యుడికి అప్పజెపుతాడో అలాగే జీవుడనే పాదుషా కూడా తన రాజ్య పాలన బుద్ధి అనే అమాత్యుడికే అప్పజెప్పటం మంచిది. అది కామ క్రోధాదులైన నౌకరుల నందరిని అదుపులో పెట్టి అవసరమైన చాకిరీ చేయించు కోగలదు. బుద్ధికి వాటిని వశం చేయాలే గాని బుద్ధిని వాటి కధీనం చేయరాదు. “బుద్ధింతు సారధిం" అన్నారు. బుద్ధే శరీరమనే రధానికి సారధి. ఇంద్రియాలనే అశ్వాలు ఈ సారధికి లోబడి సరియైన మార్గంలో పయనించినప్పుడే మోక్షమార్గంలో మన ప్రయాణం నిర్విఘ్నంగా సాగిపోతుంది. కనుక ఇంద్రియాలు బుద్ధికి దాసులైతే, బుద్ధి ఆత్మకు పరిచర్య చేయవలసి ఉంది. అది ఒక కరదీపిక లాంటిది. దీన్ని దీపిక లాగే ఉపయోగించుకొని గమ్యం చేరమని చెప్పటానికే ఈశ్వరుడీ సామగ్రిని మనకు సరఫరా చేశాడు. దీని కంతటికీ ధ్యేయం భగవత్సాన్నిధ్యమే.

  ఇంతకూ ఆముష్మికాన్ని తనకు స్వస్థానంగాను, ఐహికాన్ని ఒక సత్రంగాను శరీరాన్ని ఒక వాహనంగాను, ఇంద్రియాలను పరిచారకులు గాను, బుద్ధిని తన కమాత్యుడి గాను చేసుకోవాలి మానవుడు. అప్పుడే ఇహం మీది నుంచి పరానికి మళ్ళుతుంది మానవుడి దృష్టి, మానవుడు సృష్టిలో ఎంతో విశిష్ఠుడైనా ఆ విశిష్టతను అతడు కాపాడుకొన్నప్పుడే. లేకుంటే అతడిలో గుప్తంగా ఉన్న పశు, మృగ లక్షణాలు పైకి వచ్చి సాధన మార్గం నుంచి ప్రక్కకు తప్పిస్తాయి.

Page 118