#


Index

  భూమండలం మీదనే తన ప్రాణాలు కోలుపోయాడు. కాబట్టి భౌతికమైన దేదీ నిలవదు. శరీర మున్నంత వరకే దాని అనుభవం. శరీరం పోయినా అనుభవించే అవకాశం వాటికి లేదు. ఆకలి దప్పుల లాంటి కేవల శారీరకమైన భావాలకూ లేదు. మనో హృదయ సంబంధమైన వైజ్ఞానిక భావాలకూ లేదు. కేవల శారీరకాలు మరీ ప్రాకృతము లైతే వైజ్ఞానిక భావాలు కొంచెం సున్నితమైనవి. అంత మాత్రమే తేడా. రెండూ అర్థ కామాల కోటిలోనివే. రెండూ ఈ స్థూలదేహంతో సశించవలసినవే.

  పోతే ఇక నశించని వంటూ ఏమైనా ఉన్నవా అని ప్రశ్న. అవి ఆముష్మికమైన ధర్మ మోక్షాలేనని మన ప్రాచీనులిచ్చిన సమాధానం. వీటికి ఆముష్మిక మని పేరు. మరణానంతరం అనుభవానికి వచ్చే దొకటైతే అసలు మరణమే లేదని అనుభవానికి వచ్చే దింకొకటి. అందులో మొదటిది ధర్మం. రెండవది మోక్షం. ధ్రియతే ధారయతే ఇతి ధర్మః తాను నిలిచి మానవుణ్ణి నిలబెట్టే దేదో అదే ధర్మం. దీనిని బట్టి చూస్తే అర్ధకామాల మాదిరి ధర్మమనే పురుషార్ధం నశించేది కాదని తెలుస్తూ ఉన్నది.

  ధర్మం మాత్రమే నశించేది కాదని చెప్పటాని కేమిటి ప్రమాణం. ఇది దేహ పాతానికి పూర్వం కాక తర్వాత జరిగే కార్యక్రమానికి సంబంధించి ఉంది. దేహ పాతానంతరం దేహమే లేదు. దేహమే లేక పోతే ఇంద్రియాలు లేవు. మనసూ లేదు. అవి రెండూ లేకుంటే ప్రత్యక్ష - అనుమానాలనే రెండు ప్రమాణాలు ఎగిరిపోయాయి. ఇక మనకు ధర్మం బోధించే లోకాంతర జ్ఞానం కాని జన్మాంతర జ్ఞానం కాని ఎలా కలుగుతుంది ? కలగకుంటే అవి ఉన్నాయనే నమ్మకమేమిటి ? కనుకనే మొదటి నుంచి నాస్తిక వాదం

Page 108