సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
ప్రతినిధులా శౌనకాది మహర్షులు. నేమి శీర్ణమైనట్టుగా మన మనోనేమి కూడా శీర్ణమైన రోజులివి. వచ్చి పడ్డా మీ కర్మ భూమిలో. మరలా సాధన చేయకపోతే మనపాలిటికిది అరణ్యమే. సాధకులమనిపించుకొంటే పుణ్యక్షేత్రమూ విష్ణు క్షేత్రమే అవుతుంది. అందుకోసం యావజ్జీవమూ యజ్ఞదీక్షతుల మయి బ్రతకాలి. జీవితమే ఒక మహాయజ్ఞం. దీర్ఘసత్ప్రమిదే. వాసనా పశువును అధ్యవసాయమనే యూపానికి బంధించి ఆత్మజ్ఞానాగ్నిలో ఆహుతి చేయాలి. విషయ సుఖాలనే సమిధలందులోనే పడవేసి కాల్చి భస్మం చేయాలి. శరీరాలన్నీ ఆ పవిత్ర భస్మ విభూతితో ఉద్ధూళనం చేసుకొని పరమాత్మ తత్త్వ జిజ్ఞాసువులమై కూచోవాలి. అలాంటి వ్యవసాయాత్మకమైన బుద్ధే ఉంటే ఉగ్రశ్రవుడైన సద్గురువు మనకు తనపాటికి తానే లభిస్తాడు. అలా లభించిన వాడే సూత మహర్షి. ఆయనవల్ల భాగవత కథా శ్రవణం చేస్తున్నంత వరకూ అంతకుడు కూడా ఏమీ చేయలేకపోయాడట.
ఇహో పహూతో భగవాన్ మృత్యు శ్శామిత్ర కర్మణి న కశ్చిన్రి యతే తావ - ద్యావదాస్త ఇహాంతకః
శామిత్ర కర్మ అంటే పశు విశననం. అందుకోసం మృత్యువు వచ్చి కూచున్నదట అక్కడ. అయినా దండ ధరుడైన కాలుడు తాను కూడ కథా శ్రవణాసక్తుడయిన కారణంవల్ల ఏ ప్రాణికీ మరణ భయం లేకుండా పోయిందంటాడు మహర్షి ఏమిటి దీని బావం. బ్రహ్మాభ్యాస తత్పరులై తదేక నిష్ఠతో ఉన్న మానవులకు బాహ్య స్మృతి ఉండదు. కాలజ్ఞానం నశిస్తుంది. విద్యాలోలమ్ విగళిత కాలమని గదా పెద్దలమాట. విద్యలో మనచిత్తం రమిస్తే కాలమనేది నిలిచిపోతుంది. అంటే మనోలయమవు తుందని భావం. మనసే కాలం. దాని నలాగే పొడిగించుకొని తత్త్వంతో తాదాత్మ్యమే చెందగలిగితే ఇక మరణం కూడా లేదు మానవుడికి. “స్థిత్వా స్యా మంత కాలే 2... పి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి” అనే శాస్త్ర వాక్యానికిది అర్థవాద రూపమైన సంకేతం.
ఈ విధంగా ఈ పురాణం ఆద్యంతాలూ సంకేతార్థంతోనే నిండి నిబిడీకృతమయి ఉంది. పరీక్షిత్తు నిర్వేదంతో ఆరంభమై ఆయనగారి మోక్ష సామ్రాజ్య ప్రాప్తితో గదా అంతమవుతుంది భాగవతం. శుకుడూ పరీక్షిత్తనే రెండు మాటలూ సాంకేతికమే నని నిరూపించాము. సంజ్ఞా వాచకాలుగా Proper Nouns కనిపించేవన్నీ సామాన్య వాచకాలే Common Nouns భాగవతంలో. స్వయంకృతంగానీ, దైవికంగానీ, ఒక
Page 79