#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

దృష్టాంత గ్రంథం. అది భగవంతుడి మాట. ఇది ఆ భగవంతుడి చేష్ట. అది కృష్ణార్జున సంవాద మిది శుక పరీక్షిత్సం వాదం. అక్కడ తాతా తాతా చెప్పుకొన్నదైతే ఇక్కడ మనవడూ మనవడూ చెప్పుకొన్న కథ. అర్జునుడి మనవడే గదా పరీక్షిత్తు. పోతే శుకుడు కృష్ణుడి మనవడెలాగా అని అడగవచ్చు. “మహర్షయ స్సప్త పూర్వే చత్వారో మనవస్తథా మదీయా మానసా జాతాః" అంటాడు గీతాచార్యుడు. సప్త మహర్షులూ భగవంతుడి మానస పుత్రులేనట. వ్యాసుడు మాత్రం కాకపోతాడా. అంతా భగవంతుడి సంతానమే. ఆవ్యాస పుత్రుడైన శుకుడు కృష్ణుడికి మనవడే అవుతాడు. వీరిరువురూ నిమిత్తంగా సాగినదీ భాగవత పురాణం. అయితే ఇది దృష్టాంత గ్రంథమని గదా చెప్పాము. కాబట్టి శాస్త్రానికిది అర్థవాద రూపంగా అవతరించింది. అర్థవాదమంటే కల్పనే గదా. ఎందుకీ కల్పన అంటే ముందే చెప్పాము విజ్ఞాన వైరాగ్య వివక్షయా అని. కాబట్టి ఈ పురాణేతి వృత్తమంతా మానవులకు విజ్ఞాన వైరాగ్య ప్రబోధం కోసమేర్పడిన ఒక మహాసంకేతంగా భావించాలి మనం. విజ్ఞానాదులు గురుముఖంగా సంక్రమించాలి శిష్యుడికి. అందుకే నారదుడి ద్వారా వ్యాసుడికీ వ్యాసుడిద్వారా శుకుడికీ శుకుడిద్వారా పరీక్షిత్తుకూ లభించినట్టు వర్ణించటం.

  చివరికీ గురుశిష్య సంప్రదాయం ఇంతటితో ఆగక నైమిశారణ్య పుణ్యక్షేత్రంలో సూత శౌనకుల దాకా ప్రసరించింది. అది కూడా కలియుగారంభంలో జరిగినట్టు వర్ణించబడింది. అసలు పరీక్షిత్తు కూడా కలియుగ ప్రారంభంలోనే శ్రవణం చేసింది. కలియుగారంభంతో ఆరంభమై కలియుగాంత వర్ణనతో అంతమై పోతున్నది భాగవత కథ. ఇందులో కూడా ఎంతో అంతరార్థం గోచరిస్తున్నది. ఈ పురాణ మప్పుడెప్పుడో జరిగింది కాదు. ఎవరికో ఉద్దిష్టమయింది కాదు. ఇప్పుడీకాలంలో బ్రతుకుతున్న ఈ కలియుగ ప్రజానీకానికే - మనమే సుమా దీన్ని శ్రవణం చేసి తరించాలని బోధపడుతున్నది. కృష్ణావతారంతో గ్రంథం సమాప్తం కావటం కూడా ఇందుకొక నిదర్శనమే. ఆ తరువాత ఇక రాబోయేది కల్క్యవతారమే. దానితో కలియుగమనేది సమాప్తమయి మరలా కృతయుగ ధర్మం ప్రవర్తిస్తుంది. ధర్మ దేవత నాలుగు పాదాలతో నడుస్తుంది. అలా రావాలని నడవాలని కోరుకోవాలి నేటి మానవులు. నేటి మానవుడికి ప్రతీకలే నాటి సూత శౌనకులు. ఉగ్రశ్రవుడైన ఒక గురువుకు ప్రతీక సూతుడైతే భక్తులతో శ్రవణం చేయగోరే మనబోటి ఆస్తిక మహాశయులందరికీ

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు