#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

లాగా శాపమిచ్చాడు కాబట్టి ఏడు రోజులనే కాదు మన మనుకోవలసింది. అది కేవలం బాహ్యార్థమే. కాకపోయినా కోపం వచ్చిన వాడు ఏడు రోజులని గడువు పెట్టటమేమిటి. అలా ఎప్పటికీ జరగదు. ఏడనే సంఖ్య కిక్కడ ఒక అంతరార్థముంది.

అండకోశే శరీరే స్మిన్ - సప్తావరణ సంయుతే

  సప్తావరణలున్నాయి మన శరీరంలో. ఇవే విరాట్ఛరీరంలో కూడా ఉన్నాయి. అవే పృథివ్యస్తేజో వాయ్వాకాశా హంకార మహత్తత్త్వాలు. వీటిని ముముక్షువైన వాడు ఒకదానిలో ఒకటి లయం చేసుకొంటూ పోతే సోపాన క్రమంలో అన్నింటినీ దాటిపోయి చివరకు మహత్తనే ఏడవ ఆవరణాన్ని కూడా అతిక్రమించి నిరావరణమైన ఆత్మరూపమైన చైతన్య జ్యోతిని దర్శించి మృత్యువును జయించగలడని తాత్పర్యం. అందుకే ఈ సప్త సంఖ్యా పరిగణనం. ఒక్కొక్క దిన మొక్కొక్క భూమికను దాటి పోయేందుకు కల్పించిన సంకేతం. 12 స్కంధాల భాగవత శ్రవణం సమాప్తమయ్యే సరికి సప్తమ భూమికను కూడా దాటి పరీక్షిత్తు మృత్యుంజయుడవుతాడు. అంటే తక్షకుడు రాలేదనా, కాటు వేయలేదనా అర్థం. లేదు. తక్షకుడు వస్తాడు కాటు వేస్తాడు. విషమెక్కుతుంది. చస్తాడు. అయినా చిత్రమేమంటే రాలేదు. వేయలేదు. ఎక్కలేదు. చావలేదు. భాగవతమే చెబుతున్నదీ మాట.

దశంతం తక్షకం పాదే - లేలిహానం విషాననైః న ద్రక్ష్యసి శరీరం చ - విశ్వంచ పృథ గాత్మనః

  తక్షకుడు వచ్చినా కఱచినా పరీక్షిత్తు చావడు. ఎందువల్ల. ఆ తక్షకుణ్ణిగాని, శరీరాన్ని గాని, తుదకీ బాహ్యంగా కనిపించే జగత్తునుగాని ఆత్మకు భిన్నంగా చూడడు పరీక్షిత్తు. అది ఎలా గని “అహమ్ బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం” ఏవం సమీక్ష న్నాత్మా నమాత్మ న్యాధాయ నిష్కలే. "నేనే ఆ బ్రహ్మాన్ని బ్రహ్మమెక్కడో లేదు మరలా నా స్వరూపమే" అని సోపాధికమైన జీవభావాన్ని నిరుపాధికమైన బ్రహ్మభావంలో లయం చేసుకొని చూడటమే. అప్పుడు మృత్యువు కూడా స్వరూపమే అయి మృత్యుంజయుడవుతాడు మానవుడు. అదే మోక్షం. ఏతాదృశ మోక్షఫలాన్ని ప్రసాదించటానికే భాగవత మవతరించింది. పరీక్షిచ్ఛుక సంవాదమనే వ్యాజంతో సాగింది. భగవద్గీత సిద్ధాంత గ్రంథమైతే ఈ భాగవతమనేది

Page 77

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు