సంకేతవాదము
శ్రీమత్ భాగవత సామ్రాజ్యము
గదా భగవద్వచనం. కనుక శమాన్వితుడే. మాటాడకుండా ఉంటాడని కాదు మౌనమంటే. పాండిత్యమ్ బాల్యం నిర్విద్య మౌనేన తిష్ఠాసేత్తనే శాస్త్ర సిద్ధాంతానికి కేవలం దృష్టాంత మాయన ఆమౌనముద్ర, "అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య పర్యవసాన భూమికా మౌన" మని భగవత్పాదులు సెలవిచ్చిన అర్థం. అలాంటి వాడికిది ఇష్టమిది అనిష్టమనే ద్వైత దృష్టి ఉండరాదు. అందుకే రాజు చేసిన చర్య నతడు గర్హించలేదు. ఆమోదించనూ లేదు. ఉపేక్షించాడు.
కాని ఉపేక్షించలేకపోయింది ఆయన కుమారుడు శృంగి. శృంగమంటే కొమ్ము.
కొమ్ములున్న మృగాలన్నీ శృంగులే. అవి తమ కిష్టం లేనిదేది ఎదురయినా ఇక
ఇటూ అటూ చూడవు. తలవాల్చి నేరుగా వచ్చి కొమ్ములతో కుమ్మవలసిందే. అదే
ఈ శృంగి స్వభావం కూడా. శాపమిచ్చే సామర్థ్యం తనకుంది గదా అని ముందు
వెనకలు చూడకుండా శపించాడు పరీక్షిత్తును. అవమానం జరిగింది తండ్రికి గదా.
దానికి ప్రతీకారం తలపెట్టినా మానినా అది ఆయన చూడవలసిన విషయం.
తనకెందుకా పెద్దరికం. అదీ కేవలమూ కలి ప్రబోధమే. తక్షక విషాగ్ని చేత దగ్ధమై
పోవాలని శాపమిస్తాడు. ఎలాటి కర్మ చేస్తే మానవుడలాటి కర్మ ఫలమే
అనుభవించాలి. సర్పాన్ని కంఠంలో వేశాడు కాబట్టి సర్పమే అతణ్ణి కాటు వేస్తుందని
భావం. అయితే అది మృతసర్పం. కాటు వేయలేదు. వేసినా బాధ లేదు శమీకుడికి.
పోతే ఇది అలా కాదు. జీవత్సర్పం. భీషణమైన దాని విషాగ్నులకు శరీర ప్రాణాలు
ప్రోషితంకాక తప్పలేదు పరీక్షిత్తుకు. కారణం సర్పమని వర్ణించింది ఇక్కడ సర్పం
కాదు. కాలమే సర్పం. సర్పతీతి సర్పః ఏ మాత్రమూ అంతుపట్టకుండా చెట్టుక్రింది
నీడ మాదిరి ప్రాకుతూ వచ్చి ఎప్పుడో పైన బడి ప్రాణం తీస్తుంది కాబట్టి కాలాన్ని
సర్పంతో పోల్చారు. అదే తక్షకుడు. తక్షణమంటే తొలవటమని అర్థం. లోపల చేరి
మన తను మనః ప్రాణాదులనన్నిటినీ క్రమంగా తొలిచి మనలను నిర్మూలించేదని
భావం. అయితే శమీకుడిపాలిటికది తక్షకుడు కాదు. ఆ రూఢుడైన సిద్ధపురుషుణ్ణి
అది ఏమీ చేయలేదు. మృతమై పడి ఉంటుంది. అంటే ముక్తుడికి కాలం కేవలం
మృత ప్రాయమన్న మాట. పోతే ఇంకా ఆరు రుక్షుడూ లౌకికుడూ అయిన మానవుడికే
అది తక్షకుడు. కాటు వేసి తీరుతుంది. అందు కీశాపమొక నిమిత్త మాత్రం. జీవి
ప్రారబ్ధమే అలా శాపరూపంగా పరిణమిస్తుంది.
Page 75