#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

కనిపిస్తూ వచ్చింది వారికి. క్రౌర్య హింసా 2 సత్యదంభ కౌటిల్యాది దుర్గుణాలు పట్టణాలలో, పల్లెలో గృహస్థుల ఇండ్లలో మనస్సులలో యథేచ్ఛగా వ్యాపించసాగాయి. అవి తమ అంతరంగాలలో కూడా ప్రవేశిస్తున్నట్టు తోచి భయం వేసింది వారికి. వెంటనే ఇక జాగు చేయరాదని కులానికంతా అంకురంలాగా మిగిలిపోయిన మనుమడు పరీక్షిత్తుకు పట్టం కట్టి పరిపూర్ణ వైరాగ్య భావంతో ఉత్తర దిశాభిముఖులై పోయి నిరంతర నారాయణ స్వరూప చింతనతో ఆ నారాయణ పదాన్నే అందుకొన్నారు. విదురాదులైన పెద్దలు కూడా వచ్చిన మార్గాన్నే వెళ్లిపోయారు.

  పోతే ఇక మిగిలింది పరీక్షితొకడు. తన కొప్పజెప్పిన రాజ్యభారాన్ని అంత దారుణమైన కాలంలో కూడా గురి తప్పక నిర్వహిస్తూ మూడశ్వమేధ యాగాలు చేసి దక్షిణలిచ్చి అంతా అనవద్యంగా ఉందని భావిస్తుంటే అతనికి నమ్మశక్యంగాని ఒక దృశ్యం కంటబడింది. పుర బహిః ప్రదేశంలో ఒక వృషభమూ ఒక గోవూ రెండూ ఒకదానితో ఒకటి సంభాషిస్తున్నాయి. ఆ ధేనువు తేజో విహీనయై ధారా పాతంగా కన్నీరు కారుస్తుంటే ఆ వృషభం దానికి కారణమడుగుతుంది. అది గోరూపధారిణి అయిన భూమే గాని మరేదో గాదు. ఈ వృషభం కూడా మామూలు వృషభం కాదు. ధర్మదేవతే ఆ రూపంలో ఉన్నది. దానితో గోరూపంలో ఉన్న భూమాత ఇలా అంటుంది.

గణనా తీతము లగు స ద్గుణములు గల శౌరిసనిన - ఘోరకలి ప్రే రణమున - పాప సమూహ వ్రణయుతులగు జనుల జూచి వగచెద తండ్రీ

  ఇదీ ఆ గోవిచ్చిన సమాధానం. అది ఇలా మొరపెడుతున్నదో లేదో వెంటనే ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో ఒక దుర్మార్గుడు. రాజలాంఛనాలతో ఉన్న శూద్రుడు వాడు. ఆ వృషభాన్ని నేలగూలే లాగా నిష్ఠురంగా తనకాలితో తంతాడు. అంతేకాదు. అంభా అని అరుస్తున్నా లెక్క చేయకుండా ఆ గోవును కూడా నిర్దాక్షిణ్యంగా కూలదన్నాడు.

  ఏమిటీ సంఘటన. ఏమిటి దీని తాత్పర్యం. భూమి నిజంగా గోవయిందా. ధర్మం నిజంగానే వృషభమయిందా, కాదు. అది ఒక కల్పన. పురాణకర్త చేసే

Page 70

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు