#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

పురాణంలో. సత్యం, శౌచం, దయా, దానం. నాలుగూ పరిపూర్ణంగా ఉన్న కాలం కృతయుగం. వీటిలో సత్యం పోయి శౌచాదులు మిగిలితే అది త్రేత. అవి రెండూ కూడా తొలగిపోయి మిగతా దయాదానాలు రెండే మిగిలితే ద్వాపరం. దయ కూడా రూపు మాసి ఒక్క దానగుణమే దక్కితే అది కలి. వాటికా పేర్లు పెట్టటంలో కూడా ఈ అభిప్రాయమే సూచితమవుతున్నది. కృతమంటే అంతా ముందే సిద్ధమయి ఉన్నదిక క్రొత్తగా కర్తవ్యమంటూ లేనిదని అర్థం. సత్యయుగమని కూడా దానికి నామాంతరముంది. పోతే త్రేతా అనే మాటకు మూడనే అర్థం. ఒక గుణం కుంటుపడి మూడే ఉన్నాయని అర్థం. ద్వాపరమంటే రెండు మాత్రమే ఉన్నదని భావం. పోతే ఆ రెంటిలో కూడాఒకటి పోతే అది కలి. కలి అంటే కలహం. దైవగుణాలు చాలా వరకు పోయి అసురత్వమే చోటు చేసుకొంటే పరస్పర కలహాలు గాక మానవుల కిక ఏమి మిగులుతుందని.

  కనుకనే ఈ కలియుగానికి నాలుగు పాదాలున్నాయని కూడా భావించనక్కర లేదు. మనం పాదాలనేవి యుగాలకు కాదు. ధర్మదేవతకు. దాన్ని ఒక వృషభంతో పోల్చారు మనవారు. వృషభానికి నాల్గు పాదాలున్నట్టే ధర్మానికి కూడా ఉన్నాయి. నాలుగూ ఉంటేనే అది సక్రమంగా నడుస్తుంది. మూడైతే కొంచెం కుంటు పడుతుంది. రెండైతే ఇంకా కుంఠితమవుతుంది. ఒక్కటే అయితే ఇక చెప్పనక్కరలేదు. అలాంటి ఏక పాదంలో ఉన్నాము మనమిప్పుడు. ఈ పాదమంతమైతే ఇక రెండవ పాదమంటూ లేదు. దీని తరువాత మరలాకృత యుగారంభమే. బాగా క్రింద పడ్డ తరువాత ఇక పడేదేముంది. ఇక పడటమంటే పైకి లేవటమే. అందుకే పతనమూ ఉత్పతనమూ అన్నారు భాషలో. ఉత్పతన మంటే పైకి పడటం. అంటే లేవటమే. ఇదీ దీని విషయం.

  ఇలాంటి కలికాలాని కారంభంలో ఉన్నాడు పరీక్షిత్తు. అప్పటికి కృష్ణ నిర్యాణ వార్త విన్నారాయన పితామహులు పాండవులు. యాదువులూ, యాదవ నాయకుడూ, ఇద్దరూ కాలవాహినిలో కలిసి పోవటం చూస్తే ఏదీ శాశ్వతం కాదని పించింది వారికి. తుదకు భగవదవతారం కూడా నశ్వరమేననే భావం దృఢపడింది. అలాంటప్పుడిక మానవ మాత్రులమైన మన బ్రతుకు లేమిటనుకొన్నారు. అంతకుముందే తమ తల్లి కుంతి "భగవత్పద చింతా తత్పరయై - ముద మున సంసారమార్గమునకు” పాసి శరీర త్యాగం చేసింది. అప్పటికే కలికాల ప్రభావం

Page 69

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు