#


Index

సంకేతవాదము శ్రీమత్ భాగవత సామ్రాజ్యము

  ఋగ్వేదం పైలుడూ, సామవేదం జైమినీ, యజస్సు వైశం పాయనుడూ అధర్వణం సుమంతుడూ అభ్యసించి తమ తమ విద్యలలో నిష్ణాతులు కావటమే గాక శిష్య ప్రశిష్యుల ద్వారా ఆయా వేదశాఖలను ప్రచారం చేశారట. పోతే “ఇతిహాసః పురాణంచ పంచమో వేద ఉచ్యతే” ఇతిహాస పురాణాలకు పంచమ వేదమని పేరు వీటికి మా తండ్రి రోమహర్షణుడే ప్రచారకుడంటాడు సూతుడు. అందులోనూ అన్నీ ఒక ఎత్తు - ఈ భాగవతమొక ఎత్తు. "ఇదమ్ భాగవతం నామ పురాణం బ్రహ్మ సమ్మితమ్" ఇది వేదంతో తులతూగే పంచమ వేదం "సర్వ వేదేతి హాసానామ్ సారం సారం సముద్ధృతమ్" సకల వేద పురాణ సారమది. ఏమి కారణం. ఉత్తమశ్లోక చరితమన్నారు. ఉత్తమః పురుషస్త్వన్యః - పరమాత్మే త్యుదా హృతః - అన్నట్టు పరమాత్మ చరిత్రమిది.

  ఇలాంటి పవిత్రమైన చరిత్రను రోమహర్షణుడు వ్యాస ప్రసాదానికి పాత్రుడయి గ్రహించి లోకంలో పౌరాణిక సంప్రదాయాన్ని వెలయించాడు. అందులో మొదటి పౌరాణికుడు ఆయన సుతుడైన సూతుడు. విజ్ఞాన ఫలిత నిగమ పురాణ వ్రాతుడు. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడు. తెలియవలసినదంతా తెలిసినవాడు, తెలిసినదంతా తెలుపగలవాడు. మరి శౌనకాదులో తెలిపితే తెలుసుకొనుట కన్ని విధములా ఉద్యుక్తులయిన వారు. దేశకాల పరిస్థితులా పూర్తిగా దెబ్బతిని మోక్ష సామ్రాజ్యానికి దూరమై సంసార కాలుష్యానికి బాగా చేరువైనవి. కాబట్టి మరలా భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి నిమిత్త మాత్రులీ సూతశౌనకులు.

  అసలీ శౌనకాదులకు కలిగిన విషాదం వారికే గాదు. అది మొదట భాగవతకారుడైన వ్యాస భట్టారకుడికే కలిగింది. చతుర్వేదాలూ వ్యాసం చేసి పంచమ వేదమని వాసికెక్కిన భారతమనే ఇతిహాసం రచించి కూడా ఆయనకు శాంతి లభించలేదు. సరస్వతీ తీరంబున ఒంటరిగా కూచుని దానికి హేతువేమై యుండునా అని వితర్కిస్తుంటాడు. ఇంతలో "తన చేతి పల్లకీ తంత్రీ చయం బున సతత నారాయణ శబ్ద మొప్ప - ఆరూఢ నయ విశారదుడు నారదుడు” సాక్షాత్కరిస్తాడు. వ్యాసుడు చెప్పకుండానే ఆయన మనోవైకల్యాన్ని గుర్తించి నారదుడు ఏమయ్యా నీవు భారత శ్రుతి విధాతవు- వేదపదార్థ జాల విజ్ఞాతవు బ్రహ్మ తత్త్వ నిర్ణేతవు

Page 61

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు