#


Index

భాగవత ప్రాశస్త్యము భాగవతము

పారిజాత వర్ణన. ఇందులో మరొక విశేషమేమంటే అందులో లేని శ్లేష ఒకటి చోటు చేసుకొన్నది. కాబట్టి ఇంకా మనోహర మీవర్ణన. సప్రయోజనం కూడా. ఈ భాగవతమనే కల్పవృక్షానికి స్కంధాలు చాలా లలితమైనవి. అంటే పటిష్ఠమైనవని అర్థం. స్కంధాలు వృక్షానికెలాగో గ్రంథానికి అలాగే ఉన్నాయి. పోతే కృష్ణమూలం. వృక్షానికి మూలమనేది ఉండి తీరాలి. అది కృష్ణం అంటే కృష్ణ సర్ప పరివేష్టితమైనా కావచ్చు. లేదా నీలవర్ణ శోభితమైనా కావచ్చు. అలాగే భాగవతానికి కూడా కృష్ణతత్త్వమే మూలాధారం. శుకాలా పాభిరామంబు. శుకపికాదులు కొమ్మలమీద చేరి మధుర గానం చేసినప్పుడే వృక్షానికందం. అలాగే భాగవతం కూడా శుకమహర్షి ఆలపించినప్పుడే శ్రవణ యోగ్యమయింది లోకానికి. మంజులతా శోభితమున్ మృదువైన లతలెన్నో అల్లుకొని ఉంటాయి వృక్షాన్ని. అలాగే లతల లాంటి ఉపాఖ్యానాలెన్నో ఓతప్రోతంగా కనిపిస్తాయి భాగవతంలో. ఆ మంజులతలే దానికీ దీనికీ కూడా మంజులత నావహిస్తున్నాయి. పోతే సువర్ణ సుమనస్సులను బట్టి అది సుజ్ఞేయమట. మంచి వన్నె చిన్నెల పుష్పాలెన్నో ఉంటాయి వృక్షానికి. వాటి మూలంగా అది ఫలానా అని తెలిసిపోతుంది పాంథులకు. అలాగే మోక్ష పాంథులకీ భాగవత తత్త్వం కూడా సువర్ణ సుమనస్సులనే లక్షణాలున్నపుడే బోధ పడుతుందని భావం. సుందరోజ్జ్వల వృత్తంబు. అందమైన భాస్వరమైన వర్తులత్వమున్న వృక్షమెంతో బాగుంటుంది. మరి ఇలాంటి వృత్తమే భాగవతానికి కూడా కద్దు. వృత్తమంటే వర్తులత్వమే గాదు. ఇతివృత్తం కూడా. భగవచ్చరిత్రను మించిన సుందరోజ్జ్వలమైన ఇతివృత్తం మరే ముంటుంది. కనుకనే అది మహా ఫలంబు అయింది. గొప్ప గొప్ప ఫలాలు మనకు కల్పకం ప్రసాదిస్తే ఒకే ఒక ఫలమందిస్తుంది భాగవతం. అదే మోక్షం. ఈ మహాఫలమనే మాట ఇక్కడే గాదు. మరొక్క చోట కూడా కనిపిస్తుంది మనకు భాగవతంలో “చెలియై మేన మఱందియై సచివుడై చిత్త ప్రియుండై మహాఫల సంధాయకుడై నీ భాగ్యంబు రాజోత్తమా” అని నారదుడు ధర్మజుని సంబోధించి చెప్పిన పద్యంలో కూడా ఈ మాట మరలా ప్రతిధ్వనిస్తుంది. అక్కడా ఇదే అర్థం. ఇంతకూ ఇంతటి ప్రభావంగల ఈ కల్పతరువెక్కడ నుంచి ఆవిర్భవించింది విమల వ్యాసాల వాలంబునై-వ్యాసమహర్షి అనే పాదునుంచి పైకి వచ్చింది. ఆయన విజ్ఞాన సంపద కల్పించిందే ఈ కల్పకం. కనుకనే మోక్షమనే మహాఫలాన్ని అర్ధించిన

Page 55

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు