ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
వాచ్యార్థం కాదు లక్ష్యార్థమే చెప్పుకోవాలని చేసేదే విచారణ. అసలు తత్త్వమసి వాక్యం తత్త్వం పదాలకు సామానాధి కరణ్యం చెపుతుంది. ఇదీ అదీ సమానమని చెప్పటమే సామానాధికరణ్యం. పదాలే కాదు. పదాల అర్థాలు కూడా సమానం కావాలి. అంటే ఏకం, కావాలి. ఎలా అవుతాయవి. జీవుడీశ్వరుడే నన్నప్పుడు వీడి ఉపాధులడ్డు తగులుతాయి. అలాగే ఈశ్వరుడే జీవుడన్నా ఆయన, ఉపాధులు తగులుతాయి. కనుక లక్షణ చేత రెండుపాధులనూ, వదలు కోవలసి ఉంది. జీవుడీశ్వరుడేనని భావిస్తే వీడి పరిచ్ఛిన్నత్వం తొలగి పోయి ఈశ్వరుడి పరిపూర్ణత్వం లభిస్తుంది. అయినా అది సామానాధికరణ్యంలో ఒక భాగమే. పరిపూర్ణత్వం జీవుడికి కలిగినా - ఈశ్వరుడింకా అతడికి పరోక్షంగానే కనిపిస్తుంటాడు. అది పోవాలంటే ఆ ఈశ్వరుణ్ణి మరలా ఈ జీవుడు నేనేనని భావించాలి. అప్పుడు పరోక్షత్వం పోయి అది అపరోక్ష మౌతుంది. ఇలా ఎడాపెడా భావన చేస్తే చివరకు పరిపూర్ణ అపరోక్ష ఆత్మానుభవం తప్పకుండా సిద్ధిస్తుంది.
కనుక కేవలమూ శ్రవణమే గాక మననం కూడా చేయాలి సాధకుడు. అంతే కాదు. మననానంతరం నిదిధ్యాసన కూడా సాగించ వలసి ఉంది. ఎందుకంటే ఈశ్వరుడే నా స్వరూపమని అఖండాత్మజ్ఞాన మేర్పడినా- అది ధారావాహికంగా నిలవటమంత సులభం కాదు. మెరుపు లాగా మాసిపోవచ్చు. ఆత్మకు బదులు మరలా అనాత్మ భావాలలోకి సాధకుడు పడిపోవచ్చు. అలా పడి పోకుందా నిలవాలంటే విజాతీయమైన అనాత్మ దృష్టికి స్వస్తి చెప్పి సజాతీయమైన ఆత్మ దృష్టితోనే సాగిస్తుండాలి జీవితం. ఈ మూడవ దానికే నిది ధ్యాసనమని పేరు.
Page 95