ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
తద్బలంతోనే మనన ధ్యానాలు సాగిస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందగలరు. పోతే మూడవ వారు ప్రతిభావంతులు గారు. _ వ్యుత్పన్న చిత్తులూ కారు. కనుక స్వతంత్రించి ఏ విషయమూ గ్రహించలేరు. గురు ముఖంగానే వారు శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. మననం చేయాలి. అప్పుడే వారికి జ్ఞాన మబ్బుతుంది. పోతే ఇక నాలుగవ వారు మంద బుద్ధులు. వారికి గురువు తప్పకుండా అవసరం. గురువును సేవించి ఆయన బోధ నిరంతరం శ్రవణం చేస్తూ క్రమంగా చిత్త మాలిన్యం క్షాళితమైతే తత్త్వజ్ఞానానికి అభిముఖంగా పయనించగలరు.
ఈ విధంగా మొదటి ఇరువురికి గురువక్కర లేకపోయినా కడపటి ఇరువురికీ ఉండి తీరాలి. మొదటి వారికి కూడా ఈ జన్మలో అక్కర లేనట్టు కనిపించినా కడచిన జన్మలలో అది ఉండి తీరుతుంది. లేకుంటే ఇప్పుడీ ఉన్నతమైన భూమిక నందుకోలేరు. కారణం లేకుండా కార్యమనేది ఎప్పటికీ సంభవించదు. అంచేత ఒక గురువుతో పని ఏమిటని నిర్లక్ష్యంగా భావించరాదు. గురు నిరపేక్షంగా తమ పాటికి తాము ప్రవర్తిస్తే భ్రమ ప్రమాదాలకు లోను కావచ్చు.
అయినా గురువనగానే మనం ఉలిక్కి పడనక్కరలేదు. పూర్ణ ప్రజ్ఞుడైన పురుషుడే గదా గురువంటే. అలాంటి పరిపూర్ణ జ్ఞానాన్ని అంద జేసే వాక్యమే శాస్త్రమంటే మరి జ్ఞానమంటే అద్వైతాత్మ జ్ఞానమే. మరేదీ కాదు. అలాంటి జ్ఞానమే కావాలని కోరినప్పుడు అలాంటి పురుషుడివల్లనే పొందాలది. ఆ పురుషుడే గురువని ప్రస్తుతం చెప్పబడుతున్నవాడు. మరొక ద్వైత గురువు కాదు. ద్వైత శాస్త్రమూ కాదు. అందువల్ల గురువును సేవించిన మాత్రాన
Page 89