ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
పాషండ మతాలన్నీ తరుచుగా లోకంలో చలామణీ అవుతుంటాయి. ఫలితం వెంటనే కనిపిస్తుంది కాబట్టి అవంటే మానవులకెంతో ఆకర్షణ. సాధారణంగా మానవులు తొంభై తొమ్మిది మంది మంది ప్రజ్ఞులు. కనుకనే దుష్ట మత సాంగత్యంతో దుష్టులై పోతుంటారు. లౌకికమైన ప్రయోజనాల చేతనే సంతుష్టులై అంత కంటే అతిరిక్తమైన ఫలితంకోసం ప్రయత్నించరు. అంధ గోలాంగూల న్యాయంగా ఎక్కడికక్కడ అగమ్యమైన జీవయాత్ర సాగిస్తూ- చివర కనాత్మజ్ఞులుగానే తనువు చాలిస్తారు. అనాత్మజ్ఞులుగానే మరలా ఒక శరీరం ధరిస్తారు.
అంచేత వారికి అవిద్యాది దోషాల నాపాదించే ఇలాంటి పాషండ మతాలన్నింటినీ సంహరించి ఆ దేవి శిష్టుల మార్గానికే దుష్టులను కూడా త్రిప్పటానికి ప్రయత్నిస్తుంది. తత్ఫలితంగానే ఆయా దేశాలలో అప్పుడప్పుడు ప్రవక్తలైన ఆచార్య పురుషులు జన్మిస్తుంటారు. వారంతా దేవీ కటాక్ష బలంతోనే ఆత్మ విజ్ఞానం సంపాదించి ఆవిడ అనుగ్రహంతోనే పాషండు అందరినీ దేశం నుంచి వెళ్ళ గొట్టి మరలా దేశంలో సర్వత్రా సదాచారాన్ని ప్రవర్తింపజేస్తారు. శంకర రామానుజాదులందరూ పూర్వమలా చేస్తూ వచ్చినవారే. ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తున్నారు కొందరు మహానుభావులు. వీరందరి రూపాలలో ప్రచ్ఛన్నమై ఆ మహా శక్తే ఇలాంటి మహోద్యమం సాగిస్తూ పోతుందని మనమర్ధం చేసుకోవాలి.
తాను తరించి పరులను తరింప జేయాలని పెద్దల మాట. సదాచార సంపన్నులైన వారా గురువులందరూ. స్వయంగా ఈ సంసార సాగరం నుంచి ఉత్తీర్ణులైన వారే. అలాంటి వారి
Page 85