పూర్వార్ధము - అవరోహణ క్రమము
నిజానికా దేవి ఎప్పుడూ మన దృష్టికి తిరోధానం చెందలేదు. ఆత్మ చైతన్యమే గనుక ఎక్కడ బడితే అక్కడ సచ్చిద్రూపంగా ప్రకాసిస్తూనే ఉన్నది. ఇంతెందుకు. జీవుడని గాని జగత్తని గాని ఎదేది నీకు లోకంలో గోచరిస్తున్నదో - ప్రతి ఒక్కటీ అది ఉన్నదనీ భాసిస్తున్నదనే గదా చూస్తున్నావు. ఈ విధంగా నేనూ ఇదీ అనే వికల్పం లేకుండా ఎప్పుడీ సర్వమూ సచ్చిద్రూపంగానే గోచరిస్తున్నదో - అప్పుడా దేవి నీకు తిరోహిత ఎలా అయింది. దానినలా గ్రహించలేని మన బుద్ధి విజ్ఞానమే వాస్తవంలో తిరోహితమై కూచుంది.
ఇదిగో ఇలాటి జీవుల తిరోహిత జ్ఞాన దృష్టిని బట్టే ఆ మహా శక్తి అవతరించింది- అవతరించి మనమీద తన సమ్మోహనాస్త్రం ప్రయోగించిందనీ తలిసీ తెలియక వ్యవహరిస్తున్నాము మనం. యదార్ధంగా ఆ దేవత అవరోహణ చెందనూ లేదు. మనలను మోహింప జేయనూ లేదు. సర్వమూ కాల్పనికమే కాని పారమార్ధికం కాదు. కనుకనే ఇది దేవి తాలూకు అవరోహణమని గాని సంమ్మోహనంకూడా ఆవిడదే ననిగాని భావించరాదు. అజ్ఞాన వశాత్తు అవతరించింది మనబోటి జీవులమే. సమ్మోహితులమై ఈ భవసాగరంలో వచ్చి పడింది కూడా మనమే. చైతన్య శక్తిని గుర్తించని నేరంగా వచ్చి పడ్డాము కనుక మన ఈ దిగి రావటమూ ఈపాటు పడటమూ మనదే ఆ దేవత కారోపిస్తున్నాము. దేవతే ఇదంతా జరుపుతున్నదని భ్రమపడుతున్నాము.
అంచేత మాత అపరాధం కాదిది. కేవలం ఆవిడ కన్న ఈ బిడ్డలదే. అజ్ఞానమే ఈ జీవులు చేసిన అపరాధం. అది ఆ తల్లి స్వరూపాన్ని ఫలానా అని గుర్తించకపోవటం. అదే ఈ జీవులనా
Page 64