#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

సర్వులకూ విదితమే. అయితే వచ్చిందేమంటే విదితమైనా విదితంకానిదే అయింది. సామాన్య రూపంగా తెలుసునే గాని ప్రతి ఒక్కరికీ విశేషరూపంగా తెలియదు. దేహమే నేను - ప్రాణమే నేను- మనస్సే నేను - నేను కర్తను నేను భోక్తను- అని ఇలా దానితో దీనితో ముడి పెట్టి చూస్తామేగాని మనం- వాటి నుంచి వేరుచేసి వాటికి సాక్షి అయి విశుద్ధమైన చైతన్యమే నేనని విశేష రూపంగా చూడటం లేదు.

  అలాగే చూడగలిగితే ఇక నేమి. సంసార బంధమే లేకపోయేది. సర్వమూ నేనే నని భావించినప్పుడిక నాకు వేరుగా సంసారమెక్కడిది. అంచేత విదితమైకూడా అది అవిదితమే అవుతున్నది మానవులకు. పండితులూ పామరులని తేడా లేదీ విషయంలో. అనాత్మను కూడా ఆత్మ అని చూడనంతవరకూ పండితుడను కొనేవాడుకూడా పామరుడే నిజానికి. పండా ఆత్మ విషయా బుద్ధిః-సా యేషాం తే పండితాః అన్నారు భగవత్పాదులు. ఆత్మ అంటే ఎమిటో పూర్తిగా పట్టుకొన్నవాడే పండితుడు. ఆయా విద్యలలో ఆరి తేరిన వాడు కాడు. ఎన్ని విద్య లభ్యసించినా నేను- ఇది అని ఆత్మానాత్మలను వేరుగా చూస్తున్నవాడు ఆత్మజ్ఞుడెలా కాగలడు. ఆత్మజ్ఞుడు కాని వాడు పండితుడెలాకాగలడు.

50. మనోరూపేక్షుకోదండా
51. పంచతన్మాత్ర సాయకా
52. రాగ స్వరూప పాశాఢ్యా
53. క్రోధాకారాంకుశోజ్జ్వలా

  ఈ భేద దర్శనం వల్లనే ఆత్మ మనకీ శరీరంలోనే ప్రకాశిస్తున్నా అది అఖండ రూపంగా సాక్షాత్కరించటం లేదు. మీదు మిక్కిలి దానికి భిన్నంగా ఎక్కడికక్కడ ఖండమై

Page 58

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు