పూర్వార్ధము - అవరోహణ క్రమము
45. సుమేరు శృంగ మధ్యస్థా
46. చింతామణి గృంహాంతస్థా
త్వగింద్రియం మొదలు శుక్రధాతువు వరకూ అన్ని రూపాలూ ధరించి ఉండటమే గాదా శక్తి. మేరుదండాన్ని గూడా ఆరోహించి దాని శిఖరాన్ని కూడా అందుకొని దాని మధ్య నిలిచి ఉన్నది. భౌతికమైన మేరువు సుమేరువు కాదు. శరీర గర్భంలో ఉన్న మేరు దండమే సుమేరువు. మూలాధారం నుంచి సహస్రారం వరకు సాగిపోయిన వెన్నెముకే అది. ఈ వెన్నెముక శరీరమనే గృహానికంతటికీ మూల స్తంభం వంటిది. ఇది భగ్నమయితే ఆ శరీరం శరీరమే కాదు.
మేరు దండం బ్రహ్మ దండమని దీనికే నామాంతరాలు. దీని ఎడమ కుడి భాగాలలో ఇడ పింగళ అనే రెండు నాడులు ఊర్ధ్వ ముఖంగా పయనిస్తున్నాయి. ఆ రెండింటి నడుమ సుషుమ్న అనే సూక్ష్మమైన మరొక నాడి ఊర్ధ్వముఖంగానే ప్రసరిస్తున్నది. దానినే కుండలిని అని పేర్కొంటారు యోగులు. కుండలిని అంటే ఆడు పాము. పాములాగా ఇది కూడా పుట్టవంటి మూలాధారం నుంచి సాగి సహస్రారం వరకు ప్రాకి పోతున్నది గనుక కుండలిని అని వర్ణించారు దీన్ని. అలా ప్రాకి పోతూ మేరుశృంగం లాంటి సహస్రారాన్ని అంటే మనో గహ్వరాన్ని అందుకొని అందులోనే విశ్రమిస్తున్నదది.
ఈ విధంగా సాగి పోయే దీని ఊర్థ్వ యానాన్ని సాధకులెవరు గుర్తిస్తారో వారే దేవీ తత్త్వాన్ని కూడా గుర్తించి తరించ గలరు. అలా గుర్తించి మానవులు తరించాలనే సంకల్పం తోనే ఆ దేవి మన బుద్ధి గుహలో ప్రవేశించి అక్కడే నివసిస్తూ ఈ
Page 54