పూర్వార్ధము - అవరోహణ క్రమము
స్తంభాల లాగా ఈ శరీరమనే గృహాన్ని ధరించి ఇది పడిపోకుండా నిలుపుతున్నాయి. కనుకనే వీటికి ధాతువులని పేరు పెట్టారు. ఇవి ఏడు గట్టి పొరల లాగా మన శరీరాల లోలోనికి చొచ్చుకొని పోయి లోపలా వెలుపలా గట్టిగా దీన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఎప్పుడూ దీనిని విడిచి పెట్టవు. .
ఇందులో త్వక్కు మొదలుకొని అస్థి వరకు ఉన్న ఐదు ధాతువులూ మనకు బాగా తెలిసినవే. మజ్జా శుక్రమనేవి రెండూ అంత ప్రసిద్ధమైనవి కావు. మజ్జి అంటే ఎముకలలో ఉన్న చమురువంటి పదార్థం. శుక్రమంటే శ్వేత వర్ణమయిన పురుష బీజం. ఇవి రెండూ చాలా పుష్టికరమైనవి అవసరమైనవి శరీర స్థితి గతులకు.
ఇప్పుడీ ధాతువులు ఏడు ఆ పరా శక్తికి బాహ్యంగా ఎక్కడో లేవు. శరీరంలో ఉన్నా అవి శక్తి రూపాలే. శక్తే ఆయారూపాలతో పరిణమిస్తూ త్వగింద్రియం దగ్గర నుంచి సుక్ర ధాతువు వరకూ వ్యాపించి ఉంది. ఆయా ధాతువుల రూపాలలో ప్రచ్ఛన్నంగా మెలగుతూ జీవుడి దృష్టికంతుపట్టకుండా ఉన్నది. ఇక్కడ ఒక సూక్ష్మాన్ని గమనించాలి మనం. స్థా సంస్థా సంస్థితా నిష్ఠా అని వర్ణించినంత మాత్రాన ఆ ధాతువులకు శక్తికి తేడా ఉందని చూడ రాదు. ధాతువులలో శక్తి వచ్చి కూచున్నదని భావించరాదు. శక్తియే ధాతువు ధాతువే శక్తి. తానే ధాతువై తానే దానిలో వచ్చి కూచున్నదా శక్తి. ఆధారమూ అదే ఆధేయమూ అదే. అలా భావించినప్పుడే శక్తి సర్వాత్మకమనే అద్వైత భావం సురక్షితమవుతుంది. కనుక సంస్థా అనే మాటకు శక్తే త్వగాది రూపాలలో మలుపు తిరిగి ఉందని అర్థం చెప్పుకోవలసి ఉంది.
Page 53