పూర్వార్ధము - అవరోహణ క్రమము
23. సర్వాను ల్లంఘ్య శాసనా
ప్రవేశించటమని చెప్పాము. మాట సామెతే గాని అలా ప్రవేశించటం గూడా మనకు సాధ్యం కాని పని. కారణమేమంటే ఆవిడ సర్వాను ల్లంఘ్య శాసన. సర్వులంటే ఇటు జీవులు అటు జగత్తు సకల పదార్థాలు- ఆ మహా శక్తి శాసనాన్ని అణు మాత్రం కూడా ఉల్లంఘించి పోలేవు. అనుల్లంఘ్యమయినది ఆవిడ శాసనం. మహా రాజ్ఞి అని గదా వర్ణించారాదేవిని. ఒకరాజ్ఞ లాగానే అప్రతిహతమైన శాసనంతో పరిపాలిస్తున్నదీ జగత్తునంతటినీ. ప్రతి ఒక్క ప్రాణి ఆ విడ ఆజ్ఞను శిరసా వహించి నడచు కోవలసిందే. అతిక్రమించి పోవటానికి లేదు. కాకపోయినా ఎలా అతి క్రమించ గలము. అండపిండాదికమైన సమస్తమూ ఆవిడ క్షేత్రమే. క్షేత్రేశీ క్షేత్ర పాలినీ అని ఆవిడ పేర్లు. అలాంటప్పుడు ఆవిడ పొలం సరిహద్దులు దాటి అడుగు బయట పెట్టటానికి ఎవరికీ సాధ్యం కాదు.
కారణ మేమంటే జగదాత్మిక జగన్నియామిక అని గదా వర్ణించాము. జగదాత్మకత్వం వల్ల చతుర్థశ భువనాలూ ఆవిడ చేతిలోనే ఉన్నాయి. జగన్నియామకత్వం వల్ల వాటి మీద ఆవిడ ఆధిపత్యమే సాగుతున్నది. ఏది ఎక్కడ ఎలా ఉండాలో అది అక్కడ అలాగే ఉండాలి. మరొక విధంగా ఉండటం అనేది సంభవం కాదు. ఇలాంటి నియమానికే శాసనమని పరు, సర్వాత్మకత్వం వల్లనే ఇది సంభమవుతుంది. కనుక ఆ పరిధి లోనే జీవ యాత్ర సాగించే మనబోటి జీవులందరికీ ఆ పరిధిని దాటి పోవటం కలలోని వార్త. మనకే గాదు. మనకతీతమైన శక్తులని భావించే ముప్పైమూడు కోట్ల దేవతలకే అది తలకు మించిన వ్యవహారం. భీషాస్మాత్ వాతః పవతే - భీషోదేతి సూర్యః అని ఉపనిషద్వాణి. ఆ మహాశక్తి భయంతో గాలి వీస్తున్నదట సూర్యుడు
Page 42