పూర్వార్ధము - అవరోహణ క్రమము
మనబోటి జీవకోటి అనుభవానికే సుఖదుఃఖాత్మకమైన ఈ సంసారమనే మహా ఫలం. ఇది మనకందరికీ ప్రత్యక్ష సిద్ధమే.
ఈ ఫలానుభవంతో సమాప్తమవుతుంది ఆ మహాశక్తి పరిణామ యాత్ర. ఈ యాత్రలో ఇచ్ఛా క్రియా ఫల, అనుభవ * అనేవి నాలుగూ నాలుగు మజిలీలు నాలుగు భూమికలలోనూ ఆ జ్ఞానశక్తి ఒక్కటే అంతర్వాహినిగా ప్రసరిస్తూ వస్తున్నది. దాని స్పర్శలేకుండా ఏ దశ గాని తన పాటికి తాను నిలవలేదు. ఆ ఒక్కటే ఒక నర్తకి లాగా ఈ నాలుగు వేషాలు ధరించి బ్రహ్మాండంగా నర్తిస్తున్నది. కనుక ఫలానుభవం వరకూ పరచుకొని ఉన్న ఈ నాలుగవస్థలలోనూ చిద్రూపిణి అయిన ఆ పరాదేవతనే దర్శిస్తూ పోవాలి మనం. అలా దర్శిస్తూ పోతే క్రమంగా మనమా చిద్రూపాన్నే అందుకొని ఈ సంసార సాగరాన్ని దాటి పోగలము. ఇక్కడ ఒక సూక్ష్మాన్ని మనం గ్రహించవలసి ఉంది. జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులలో మొట్ట మొదటిది జ్ఞానమే అయినా ఇచ్ఛా శక్తితో ప్రారంభమవుతున్నదీ నామం. జ్ఞానస్వరూపమైన శివతత్త్వం కంటే ఇచ్ఛాస్వరూపిణి అయిన పరాశక్తికి ప్రాధాన్యమివ్వటం కోసం దానితో మొదలయింది అని గ్రహించాలి మనం. అంతే గాక సృష్టి పరిణామానికంతటికీ ఇచ్ఛాశక్తే మూలంగనుక ఇచ్ఛతోనే ప్రారంభించవలసి వచ్చింది. అంతేగాని ఇందులో వ్యుత్ప్రమదోషం ఏదో దొరలిందని బ్రమపడరాదు.
13. చిచ్ఛక్తిః - చేతనా రూపా
జ్ఞానశక్తి ఒక్కటే ఇచ్చారూపంగానూ క్రియారూపంగానూ పరిణమించిందని తెలుసుకొన్నాము. అది క్రియా రూపంగా ఫలరూపంగా కూడా ఎలా పరిణమిస్తున్నదో ఆ మార్గాన్ని ఇప్పుడు
Page 30