సింహావలోకనము
తల్లి దండ్రుల వల్ల సంక్రమించిన ఆస్తి. ఇందులో జ్ఞాన శక్తి తండ్రి-కి యా శక్తి తల్లి. అవే మనః ప్రాణ రూపంగా ప్రవేశించాయి ఈ కుమారుడిలో. అయితే ఇవి రెండూ ఆ తల్లి తండ్రులలో మాదిరి పరిపూర్ణంగావు. శరీర మాత్ర పరిచ్ఛిన్నం. అందుకే వారు కల్పించిన శ్రీ అంటే ఐశ్వర్యమేుదుందో దాన్ని విస్మరించి కేవలం ఈ గణాధిపత్యంతో తృప్తి పడ్డాడీ జీవుడు.
గణమనేది వీడికి ఈ సంసారమే అని చెప్పాము. దాని కనుగుణంగానే వీడికీ మహాకాయ మేర్పడింది. దానికి తగిన తుండం. చెవులూ చడుస్సులూ. దంతాలు రెండు కూడా లేవు ఒక్కటే. క్రింద ఒక వాహనం. అది కూడా ఒక మూషికమట. ఏమిటి ఇదంతా. ఏమిటి తాత్పర్యం. మూషికమంటే చపల స్వభావం. దాని నధిష్ఠించి ఉంది వీడి మనస్సు. గజ మహంకారానికి చిహ్నం. అహం కర్త జీవుడే. వాడీ చపలమైన మనసుతో ఏదేది చూస్తాడో అదంతా సుఖమేనని భుజిస్తూ పోతాడు. అందుకే వీడి కాయం మహాకాయమైంది. దీనికి తోడు చెవులు పెద్దవి. కన్నులు చిన్నవి. ఏమిటర్ధం. తత్త్వాన్ని ఎంతగానో వింటాడే గాని దాన్ని దర్శించే శక్తి లేదు. ఆముష్మికమైన శ్రేయస్సును చూడలేక ఐహికమైన ప్రేయస్సు మీదనే దృష్టి సారిస్తాడు. దానికి సంకేతమే ఆ ఏక దంతం. ఇలా జీవితం సాగించే ఈ జీవుడనే గణపతికి సహచరులెవరు. భూత ప్రేతాది గణాలు. ఎవరో కాదు వారు. భూత భౌతిక వాసనలే. వారితోనే నిత్యమూ సతమతమౌతూ పితృ దత్తమైన జ్ఞానైశ్వర్యాలను రెంటినీ కోలుపోయాడు. ఏదైనా కొంచెముంటే అది ఈ గణాలకు పంచి పెట్టాడు. దానితో కామేశ్వర.... గణేశ్వరా అనే నామంలోని
Page 126