ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
మస్వస్థలం. ఇలా భావించటమే ప్రాకృతమైన దృష్టి. ఇది అప్రాకృతమైన పారమార్థిక దృష్టిగా మారితే అది చీకటి లాగా విరిసి, పోగలదు. అప్పుడు చిద్రూపిణి అయిన భగవతి స్వస్థగానే మరలా అనుభవానికి రాగలదు. అది మన ఆత్మ స్వరూపమే గనుక ఆ నెపంతో మనమే మరలా స్వస్థులమని పించుకుంటాము.
ఎప్పుడిలాటి స్వస్థత చేకూరుతుందో అప్పుడు దానికంటే వేరొకటి ఇంతకు ముందు లేదు- ఇప్పుడు లేదు- ఎప్పుడూ లేదనే సార్వ కాలికమైన భావమొకటి ఏర్పడుతుంది. అప్పుడా చితి శక్తి అనేక కాదు ఏకాకిని అనే ప్రజ్ఞ మన కుదయిస్తుంది. సర్వదా సర్వత్రా * చిద్రూరమే అయినప్పుడు ఆవిడ ఏకాకిని ఎలా కాక పోతుంది. అయినా చమత్కారమేమంటే ఏకాకిని అయికూడా మాయా శక్తి ప్రభావంతో అనేకాకినిగా పరిణమించగలదు. అదే ఈ ప్రపంచం. బహు రూపా - బృహత్సేనా- వివిధాకారా- విష్వకస్సేనా- అని నామావళిలో అక్కడక్కడా నామాలిదే అర్థాన్ని బయటపెడుతున్నాయి. ఆ ఏకైక శక్తి అనేక భూమికలు ధరించి కనిపిస్తున్నది గనుక ఇవన్నీ నిజానికి యదార్థమని భావించ రాదు.
అయినా ముప్పాతిక మంది అల్ప ప్రజ్ఞులీ లోకంలో. వారు తమ అల్పజ్ఞతతో ఏకాకిని అయిన ఆ దేవతను పుత్ర కళత్ర క్షేత్ర గృహాదుల రూపంగా దర్శిస్తున్నారు. ఆయా నామరూపాలలోనే ఆత్మ దృష్టి పెట్టుకొని దానినే నెమరువేసుకొంటూ పోవటం మూలాన తమ స్వరూపాన్ని కూడా నానా రూపాలుగా భానిస్తూ-అస్వస్థులు కాకున్నా తమ భావనలో అస్వస్థతను కొని తెచ్చుకొన్నారు. దానితో ఎప్పుడూ స్వస్థగానూ ఏకాకిని గానూ మెలగుతున్న ఆ పరా శక్తికి దూరమై దానిని తమ స్వరూపంగా
Page 113