ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
శాంతయే గాదావిడ బ్రాహ్మి కూడా నని చెబుతున్నది నామం. బృహద్రూప అయి సర్వత్రా వ్యాపించినది గనుకనే ఆవిడ బ్రాహ్మి. ఆవిడను సేవించిన సాధకులకు కూడా అలాంటి బ్రాహ్మీ దశనే ప్రసాదించగలదు. శాంత మైన స్థితి ఎప్పుడూ బ్రాహ్మీ స్థితే. ఏషా బ్రాహ్మీ స్థితిః అని గీతలో కూడా వస్తుంది. బ్రహ్మ నిర్వాణదాయకమైనదా స్థితి. ఎప్పుడో మరణానంతరం కాదు. జీవిత కాలంలోనే. బ్రహ్మ సంబంధమైనది గనుక దీనికి బ్రాహ్మి అని పేరు. బ్రహ్మమనేది ఎప్పుడూ ఉన్నది గనుక ఈ దశకూడా దానితో పాటు ఉండవలసిందే. ఉదయాస్తమయాలు లేని దశ ఇది.
అంతే కాదు. శాంతా బ్రాహ్మీ అనే గాక పరా నిష్ఠ కూడా అది. దీనికంటే అన్య మైన దశ మరొకటిలేదు. అతీతమైనదీ లేదు. నిష్ఠ అంటే పరిసమాప్తి అని అర్థం. సానిష్ఠా సాపరా గతిః అని చాటింది ఉపనిషత్తు. ఇంద్రియ విషయాలు మొదలు కొని పురుష తత్త్వం వరకూ ఉన్న అన్ని దశలనూ సోపాన క్రమంలో వర్ణించి చివరకు పూర్ణమైన పురుష స్వరూపం కంటే పరమైనది లేదని అదే నిష్ఠ అని తేల్చి చెప్పింది. కనుక అది పరా నిష్ఠ. ఇంతకూ సకల ప్రపంచమూ శాంతిస్తే- అది సర్వ వ్యాపకమైన బ్రహ్మచైతన్య మైతే-అంతకు మించి మరేదీ లేదు గనుక అదే పరా నిష్ఠ కూడా అవుతున్నది. అలాటి దేవీ స్వరూపమే ఎప్పటికైనా మన అనుభవానికి రావలిసింది.
37. హేయోపాదేయ వర్జితా
ఇలాంటి పరా నిష్ఠను ఏ జీవుడు అందుకోగలడో అతడే జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్తి సుభాన్ని అనుభవించ
Page 105