#


Index

  శక్తి ఉందో తద్వారా ఆవిర్భ వించిందీ సృష్టి అంతా. అంతే గాని వాస్తవం కాదిది. అద్వైతులు చెప్పే దృష్టి సృష్టి వాద మిది. తన సృష్టే ఇలా అయథార్థ మయినప్పుడు తాను జన్మించటం మాత్రమిక యథార్థ మెలా కాగలదు. కనుకనే నందాంగనకు డింభకుడుగా కనిపిస్తున్నా అది “మహాంతం విభు మాత్మాన" మన్నట్టు మహద్రూపమే విభూతే. అయినా అసత్యమైన ఈ సృష్టి సత్యంగా భాసించ జేస్తున్నాడు. అజాతుడైనా తానొక నంద యశోదలకు జన్మించినట్టు భాసిస్తూ వచ్చాడు. ఇదొక కేళి ఆయన పాలిటికి. ఆ కేళి లో లోలుడయి దాని ఫలితంగా ఇంత పెద్ద నాటకం మన కొక ఇంద్రజాలం లాగా చూపుతున్నాడు.

  ఇదీ కృష్ణావ తార తత్త్వాన్ని గూర్చి మహాకవి అర్థం చేసుకొని మనకు చేసిన బోధ. మనం కూడా అలాగే అర్ధం చేసుకోవాలా తత్త్వాన్ని. అసలు భాగవత ముద్దేశించింది కూడా అదే. "సర్వే వ్యంశ కలా విష్ణోః కృష్ణస్తు భగవాన్ స్వయమ్” అని మొదటనే చాటుతున్నది భాగవతం. మిగతా మత్స్య కూర్మాదులన్నీ అంశ కళలే నట పరమాత్మకు. ఒక్క కృష్ణావతారమే పరిపూర్ణమైనది. ఇది విష్ణువుకు అంశ కాదు. సాక్షాద్విష్ణువే. ఆ హరి కృష్ణుండు బలాను జన్ము - డెడలే - దావిష్ణుడౌ నేర్పడన్. శుద్ధ సత్త్వోపాధి అయిన విష్ణు దేవుడే కృష్ణుడనే మరొక రూపంలో భాసిస్తున్నాడంత మాత్రమే. దీనికి ప్రబల మైన తార్కాణం మనకు భాగవతంలో ఒకచోట కనిపిస్తుంది. కృష్ణుడు కుశస్థలిలో ఉండగా ఒకనాడు ద్వారకలో హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు మృతుడైన తనశిశువును రాజ ద్వారం దగ్గర పెట్టి గట్టిగా విలపిస్తాడు. అప్పటి కది ఆయన భార్యకు తొమ్మిదవ కానుపు. పుట్టగానే ఎప్పటి కప్పుడు కాలుడా బిడ్డలను పొట్టన పెట్టు కొంటున్నాడట. రాజులు ధార్మికులయి సక్రమంగా దేశాన్ని పాలిస్తుంటే ఇలాంటి అత్యాహిత మెలా జరుగుతుంది-దీని కంతటికీ పాలకుడే కారణమని నిష్ఠురా లాడతాడా బ్రాహ్మణుడు. అప్పుడక్కడ సన్నిహితుడయి ఉన్న అర్జునుడా మాటలు విని

Page 98