#


Index

  ఈ కాలంలో మన రాజ్యాంగమూ శాసనవిధానాలూ మన ఎలా ఉన్నా మనకెంత సరిపడకున్నా ప్రశ్నించ గలుగుతున్నామా - చచ్చినట్టు దాన్ని మనం నెత్తిన పెట్టుకోవటం లేదా అలాగే అనుకోండి ఏ ధర్మమైనా. అలాటి ఒకానొక ధర్మ సూక్ష్మమే ఈ శంబూక వధ కూడా. పైగా వధించిన వాడెవడు. మనలాటి నరుడా. లేక నరేంద్రుడా. కాడు. నరుడూ కాడూ. నరేంద్రుడూ కాడు. ఈ ఇద్దరి పరిధీ దాటిన నారాయణుడు. మరి నారాయణుడు చేసిన కృత్యం నరుల కేమంతు పడుతుంది. నారాయణుడి లీల నారాయణుడికే వేద్యం. కనుకనే శంబూక వధానంతరం అగస్త్యాశ్రమానికి వెళ్లితే రాము డగస్త్యు డాయనను చూచి త్వమ్మే బహుమతోరామ - గుణైర్పహుభి రుత్తమైః- సురాహికథయంతి త్వామాగతం శూద్రఘాతినమ్ - నీవు శూద్రుణ్ణి వధించి బ్రాహ్మణ బాలుణ్ణి బ్రతికించి వచ్చావని దేవతలు చెబితే విన్నాను. చాలా మంచి పనిచేశావు. త్వంహినారాయణః శ్రీమాన్ త్వయి సత్యం ప్రతిష్ఠితమ్- నీవు సాక్షా న్నారాయణుడవు. నీలోనే సత్యం ప్రతిష్ఠిత మయి ఉన్నది. త్వం ప్రభు స్సర్వభూతానామ్ - సమస్త ప్రాణులకూ శాసకుడవు నీవే. నీవు చేసిన పని కాక్షేపణ ఏమున్నదని ప్రశంసిస్తాడు. ఇక మన మభిశంసించి ఏమి ప్రయోజనం. ఊరక మన అల్పజ్ఞతను చాటు కోటమే. కాకపోయినా నారాయణుడు చేసిన పని నరుడికెలా బోధపడుతుంది. ముహ్యంతి యత్సూరయః- అని గదా భాగవతం మ్రోగించిన సందేశభేరి- పైగా రాజదండన వల్ల యమదండన లేకపోవటమే గాక ఆ శూద్ర తపస్వికి అనుకోకుండా స్వర్గసుఖమే లభించింది. ఇది ఆగ్రహవ్యాజంతో భగవానుడు చూపిన అనుగ్రహమని భావిస్తే ఇక ఏ గొడవాలేదు. కాబట్టి ధర్మమే గాదు మనం గ్రహించవలసింది. ధర్మ సూక్ష్మం. అంతవరకూ దృష్టి సారిస్తే ఇక ఎలాటి ఆక్షేపణలకూ చోటు లేదు రామాయణంలో.

Page 94