అది చెప్పనే చెప్పిందా విషయం నేను ఫలానా వాడి చెల్లెలినని. పైగా కుంభకర్ణుడు నిరంతర నిద్రాశీలుడని-విభీషణుడు పరమ ధార్మికుడనీ బయటపెట్టింది. ఇరుగో ఖరదూషణులు నా సోదరులే. వారిక్కడే ఉన్నారీ దండకారణ్యంలో అని వర్ణించింది. ఇదంతా తన భావికార్యక్రమం. తనకది జ్ఞాపకం చేసి నట్టయింది. ఇంకా ఆలస్యం దేనికి. తయారుగా యుద్ధానికని హెచ్చ రించినట్టయింది. అందుకే రాముడంతగా దానితో చదురులాడి దాన్ని రెచ్చగొట్టటం. ఏడిపించటం, రెచ్చిపోయి అది అఘాయిత్యం చేస్తుందని తెలుసు ఆయనకు. అప్పుడే చేద్దామనుకొన్నాడు దానికి శాస్తి చేస్తే అది ఖరదూషణాదులను తన మీదికి పంపుతుంది. పంపితే వారిని చంపవచ్చు. చంపితే అది ఊరుకోదు. పోయి రావణుణ్ణి రెచ్చగొడుతుంది. అప్పుడూ కథ రసకందాయంలో పడేది. అందుకే ఈ నాటకమంతా. ఇంత ఉంటే ఇందులో ఇదంతా గమనించక ఏదో మన బుద్ధులకు తోచినట్టు అసంబద్ధంగా ఆలోచిస్తే ఏమి ప్రయోజనం. అదీ ఆ శూర్పణఖ చేసిన అసంబద్ధ ప్రలాపన మాదిరే అయి కూచుంటుంది.
పోతే ఇక మూడవ ఆక్షేపణ రాముడి మీద ఆయన సీతా వియోగానంతరం పడిన ఆవేదన. రాముడంటే పరమాత్మ అని గదా మీరు బ్రహ్మరథం పడుతున్నారు. పరమాత్మే అయితే ఆయనకు కామక్రోధాది దౌర్బల్యా లుండగూడదు గదా. అలాంటి మాటలూ చేష్టలూ పనికిరావు గదా. పైగా శూర్పణఖాదులంతా కాముకంగా వ్యవహరించారని గదా వారిని నిర్ధాక్షిణ్యంగా శిక్షించాడు. అలాంటివాడు తానే భార్యా వియోగాన్ని భరించలేక వాపోవట మేమిటి వలవల ఏడవటమేమిటి. పైగా ఇంకా సిగ్గుబోయే విషయ మేమిటంటే తనకన్నా చిన్నవాడు లక్ష్మణుడు. అతడి దగ్గర వలపోసుకోవట మేమిటి. అరణ్య కాండాంతంలో కిష్కింధా రంభంలో ఎంతగానో వర్ణించాడు వాల్మీకి రామ విలాపాన్ని. -యది దృష్టా త్వయాసీతా-సీత మీకు కనపడి ఉంటే చెప్పి నా ప్రాణాలు కాపాడమని అరణ్యంలో
Page 75