మరి నాలుగు మార్లు చూపాడు విశ్వరూపాన్ని కృష్ణుడు తన జీవితంలో. అలాంటి ఘట్టం ఒక్క మారుకూడా చూడబోము రాముడి జీవితంలో. ఇక గోవర్ధనోద్ధరణం దగ్గరనుంచీ దగ్గరనుంచీ కాళీయ మర్ధనం చివరిదాకా కృష్ణుడు చేసిన చూపిన అతి మానుషమైన చర్యలూ లీలలూ ఇన్నీ అన్నీకావు. ఎప్పటి కప్పుడు బంధుమిత్ర శత్రు భక్త జనావళి నంతా ఆశ్చర్య రసార్ణవంలో ముంచి తేలుస్తూ ఆయన గారి అవతారతత్త్వాన్ని చెప్పకుండానే చెబుతూ వచ్చింది. ఇలాంటి అద్భుత చర్యలలో ఒక్కటి కూడా మనకు దాఖలా అయినజాడా గోచరంకాదు రామావతారంలో. మొదటినుంచీ చివరిదాకా అంతా మానవోచితమైన వ్యవహారమే. మాటలే. సుఖదుఃఖాద్యనుభవమే. సామాన్య మానవుడికంటే ఇంకా తక్కువస్థాయిలో వ్యవహరించినట్టుగా కూడా కనిపిస్తుం దక్కడక్కడా, కడకు లక్ష్మణుడు, సుగ్రీవుడు - ఇలాంటి వారు కూడా ఆయనకు ధైర్యం చెప్పవలసి వచ్చింది. స్వాస్థ్యం భద్రం భజస్వార్య - త్యజ్యతాం కృపణామాతిః అని సీతా వియోగంలో అలమటిస్తుంటే లక్ష్మణుడు - అలంవైక్లబ్య మాలంబ్య – ధైర్యమాత్మ గతంస్మర - త్వద్విధానా మసదృశ - మీదృశం విద్ధిలాఘవమ్ - మయాపి వ్యసనం ప్రాప్తం- భార్యాహరణ జం మహత్ - నచాహమేవం శోచామి - నచ ధైర్యం పరిత్యజే - అని సుగ్రీవుడూ సుతిమెత్తని మాటలతోనే ఘాటుగా మందలిస్తా రాయనను.
మొత్తాని కిదంతా గమనించి చూస్తే కృష్ణుడిలాగా రాముడు లీలా మానుషమైన అవతారం కాదని అది మానవోచితమైన జీవితమేనని మహాఅయితే మానవులలోనే ఒక ఆదర్శప్రాయుడైన మానవోత్తముడి వ్యవహారమేనని తేట పడుతున్నది. దీనికి తగినట్టు వాల్మీకి మహర్షి ఎక్కడా తన కావ్యంలో రాముణ్ణి భగవంతుడని పేర్కొనుడు. దాశరథిః కౌసల్యా నందవర్ధః - రాజపుత్రః - అని ఇలాంటి మాటలతోనే వర్ణిస్తూ పోతాడు. ఏ మిత్రుడుగాని, బంధువుగాని, మహర్షి గాని తుదకు గుహశబర్యాది
Page 7