ఒక పనిచేస్తే లోకులేమంటారో ననే సంకోచముండాలి ఎప్పుడూ ప్రభువైనవాడికి. అలాంటి స్వభావ మున్నవాడు గనుకనే ఇంకా ఎవరూ తన్ను తప్పు పట్టకముందే లంకానగరంలోనే అనుమానిస్తాడు సీతను. అగ్ని పరీక్షకు గురిచేస్తాడు. పోతే అదికూడా విశ్వసించని అయోధ్యావాసుల కోసం అసలావిడను నవమాసాలూ నిండిన నిండుచూలాలని గూడా చూడక నిర్ధాక్షిణ్యంగా పరిత్యజించాడు. ప్రజల కోసం తన వ్యక్తిగత సౌఖ్యాన్నికూడా కాలదన్నాడంటే ఇంత కన్నా రాజ ధర్మపాలనా - పారతంత్య్ర మేముంది-చెప్పండి. ఇలాంటి ధైర్యసాహసాలు సంసిద్ధతా ఉన్నవాడు గనుకనే మొదటి నుంచీ సమయం వచ్చినప్పుడల్లా యదివా జానకీమపి నా జానకినైనా సరే వదులుకోటానికి వెనుదీయనని ఒక మాట అంటూ వస్తాడు. ఏ వేళ ఏ నోట అన్నాడో గాని అది అలాగే ఫలించింది.
ఇక రెండవది శంబూకవధ. వర్ణాశ్రమ ధర్మాలనేవి శాస్త్రచోదితం. అవి మానవులంతా ఏ కాలంలోనైనా ఏ రాజ్యంలోనైనా పాటించి తీరవలసినదే. అప్పుడే అది సౌరాజ్యం. లేకుంటే ధర్మసాంకర్యమూ విప్లవమూ ఏర్పడి అస్తవ్యస్తమై పోతుంది లోక వ్యవస్థ. అదే మానవ జాతికి వినిపాతం. చివరకు జగత్ప్రళయం. అలాంటి అనర్థం నివారించాలంటే ధర్మమనేది నాలుగు పాదాలతో నడవాలి. నడవాలంటే అది నడిపే రాజును బట్టి ఉంటుంది. యథారాజా తథాప్రజాః పాలకులను బట్టే పాలితులు. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడు కాళ్లతోనే నడుస్తుంది. లేదా అసలు నడవనే నడవదు. అది ఏదో అత్యాహితానికి కూడా దారి తీయవచ్చు. అలాగే తీసింది శంబూకుడి వ్యవహారం. వాడొక శూద్రుడు. తపస్సు చేయటం వాడి ధర్మంకాదు. అయినా చేశాడు. అందులోనూ ఏదో కామ్యం మనసులో పెట్టుకుని చెట్టుకొమ్మకు తల్లక్రిందులుగా వ్రేలాడుతూ క్రింద ధూమ పానం చేస్తూ తపస్సు సాగించాడు. అది ఒక ఆభిచారిక హోమంలాంటిది. దారుణమైన ఈ చర్య రాజ్యంలో ఎక్కడో ఒక విప్రకుమారుడి ప్రాణాలు
Page 63