పంపటమే గాదు. మార్గ మధ్యంలో అతడికెలాటి అవాంతరాలూ జరగకుండా కాపాడినవాడూ రాముడే. సురసా - సింహికా - లంకిణ్యాదులు సామాన్యులు కారు. అలాంటి వారిని నిర్జించి లంకలో ప్రవేశించాడంటే హనుమంతుడు – శ్రీరాముడి ప్రభావం వల్లనే. రామనామమే - రామస్మరణే అతనికి శ్రీరామరక్ష. సర్వజగద్రక్ష గదా అది. జగద్ధిత కరుడైన ఒక వానరుణ్ణి రక్షించక పోతుందా. అతడే అంటాడు మహేంద్ర పర్వతం మీది నుంచి వినువీధికి లంఘిస్తూ యథారాఘవ నిర్ముక్త - శ్మరశ్మ్వసన విక్రమ స్తద్వల్లంకాం గమిష్యా మి రామధను ర్విముక్తమైన బాణంలాగా అతివేగంగా ఆకాశంలో దూసుకుపోతాను. లంకలో ప్రవేశిస్తాను. హనుమంతుడంటే రామ బాణమేనట. నిజమే మరి. రెండూ స్వామి వారి చేతిలోనివే. స్వామి బలంతో పనిచేసేవే. స్వామి కార్యాన్ని సాధించే సేవకులే.
మధ్యలో తనకు మైనాకు దాతిధ్యం చేస్తానన్నా తామసించలేదా సేవకుడు. త్వరతే కార్యకాలోమే - ప్రతిజ్ఞాచమయాదత్తా - నస్థాతవ్య మిహాంతరే. నీవేమి అనుకోకు. ప్రతినబూని వచ్చాను. స్వామి కార్యం నన్ను తొందరచేస్తున్నదని వెళ్లిపోతాడు. సురసతో కూడా అదే మాట అంటాడు. అన్నివిఘ్నూలు తన స్వామి మహిమవల్లనే దాట గలుగుతాడు. అదృష్టంగా స్వామిహస్తం పనిచేస్తూనే వస్తున్నది. అది ఆ భృత్య భక్తుడెప్పుడో గ్రహించాడు. కనుకనే లంకలో ఎక్కడెక్కడో వెదకి అమ్మవారిని గానక చివరకు దూరంగా కానవచ్చే అశోకవనంలో ఉండవచ్చునని ఆశపడి సముహూర్త మివధ్యాత్వా - ఉదతిష్ఠన్ మహాతేజాః- ఒక్క క్షణం కండ్లు మూసుకుని ధ్వానం చేసి వెంటనే లేచి నిలుచుంటాడు. నిలుచొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ- అని రామమంత్రం జపిస్తాడు. ఆ మంత్ర బలమే పనిచేసి అమ్మవారి దర్శనం చేయగలుగుతాడు. దారి పొడుగునా కాపాడుతూ వచ్చింది రాముడి కాయన పయినున్న అవ్యాజ కారుణ్య ముద్ర ఒక్కటే.
Page 56