పోతే ఇక సుందరకాండలో అయన చూపింది స్వామిధర్మం. భృత్యుల విషయంలో స్వామిధర్మమే గదా చూపవలసింది. భృత్యులెవరు రాముడికి. అందరూ భృత్యులే నిజానికి. అయితే విశేషించి వానరులందరూ ఆయన భృత్యులు. ఆయన గారికి కైంకర్యం చేయటాని కాయారూపాలలో అవతరించిన దేవతలే గదా వారు. తమ కార్యం కోసమే అయనను సేవిస్తూ వచ్చారు. వానరులైనా అందుకే. వానరరాజైన సుగ్రీవుడైనా అందుకే. అయితే వారందరూ ఒక ఎత్తు. వాయుపుత్రుడైన హనుమంతుడొక ఎత్తు. వారు చిన్న పెద్ద మేడలు మిద్దెలైతే ఇతడన్నిటికన్నా ఎత్తుగా పైకి లేచిన ఒక పతాక లాంటికాడు. కిష్కింధలో స్వామిదర్శనం చేసుకొన్నది ప్రప్రథమంగా హనుమంతుడే. స్వామిదర్శనంతోనే భాగ్యవంతుడ నయ్యాననుకొన్న హనుమంతుడు. చరిత్రలో ఎన్నడూ చూడకపోయినా ఎన్నాళ్లనుంచో చూస్తూ ఉన్నంత భక్తి ప్రవత్తులు ప్రదర్శించాడు. ఎంతగానో ప్రస్తుతి చేసి ఆయన గారి ప్రశంసలందు కొన్నాడు. సుగ్రీవుడితో సఖ్యం చేయించాడు. రామకార్యం సుగ్రీవుడెక్కడ మరచిపోతాడో ఏమరి ప్రవర్తిస్తాడో నని మునుముందే అతణ్ణి హెచ్చరిస్తూ వచ్చినవాడు. అది మొదటి నుంచి కనిపెడుతూ ఉన్నాడా స్వామి. విశేషించి సుగ్రీవుడు తన ఎదుటనే అతణ్ణి కీర్తించటం గుర్తించాడు. తతః కార్యసమాసంగ - మవగమ్య హనూమతి- విదిత్వా హనుమంతంచ చింతయామాస - కార్యమతడి వల్లనే నెరవేరవలసి ఉందని గ్రహించి హనుమంతుడు గదా అని తెలిసి ఆలోచించాడట రాముడు. హనుమంతుడని తెలిసి ఏమిటి. ఏమో మనకేమి తెలుసు ఆ స్వామికే తెలియాలి ఆభృత్యుడి వ్యవహారం. ధ్రువఃకార్య ఫలోదయః ఏ కార్యమైనా ఫలించాలంటే ఇతడి విషయంలో తిరుగులేదని నిశ్చయించుకొంటాడు. ప్రహృష్టేంద్రియ మానసః అతణ్ణి చూస్తుంటే మనస్సుకెంతో ఆహ్లాద మయిందట స్వామికి. వెంటనే అంగుళీయక మిచ్చి పంపుతాడు.
Page 55