నావి-నాసుఖదుఃఖాలు నీవి- అనుకోవా లంటాడు రాముడు. ఉత్తమమైన మైత్రి సుఖదుఃఖాలు సమానంగా పంచుకోటంలోనే ఉంటుంది. అనంతరం వాలి వల్ల జరిగిన పరాభవమంతా వినిపిస్తే సుగ్రీవుడు-రాముడంటాడు. ఉపకారఫలం మిత్రం విదితం మేమహాకపే-మిత్రుడంటే ఒక కష్టంలో ఆదుకొనేవాడేనని నాకు తెలుసు. తప్పకుండా వాలిని వధించి నీకు మేలు చేస్తానంటాడు. ఇదే వాక్య మభిమానా-త్సమీరితం-అనృతం నోక్త పూర్వంమే-నచపక్ష్యే-కదాచన- ఎంతో అభిమానముంది నీ మీద నాకు. అందుకే ఇలాంటి ప్రతిజ్ఞ చేశానంటాడు.
అప్పటికీ నమ్మలేక పోయాడు సుగ్రీవుడు. నమ్మలేక గాదు. వాలి పరాక్రమ మెంతటిదో తెలుసు అతనికి. రాముడి బలపరాక్రమాలా ఇంకా తెలియవు. అందుకే అవి తెలుసుకోవాలని కోరిక. తెలిసిందో ధైర్యం తప్పకుండా వాలిని చంపగలడని. అందుకే వాలి పూర్వ వృత్తాంతమంతా ఏకరువు పెడతాడు. అతడు వధించి దూరంగా పారవేసిన దుందుభి కాయాన్ని చూపుతాడు. దానిని తన పాదాంగుష్ఠంతో పారజిమ్ముతాడు రాము డు. చిమ్మితే అది పది యోజనాల దూరం పోయి పడుతుంది. రక్తమాంసా లెండిపోయిన శుష్కమైన కళేబరాన్ని చిమ్మి సుఖమేమి టంటాడు సుగ్రీవుడు. ఇదిగో చూడు. ఇటువైపు సప్తసాలాలు నిలిచివున్నాయి. వీటిలో ఒకదాన్ని నీ బాణంతో మీటు చూతామంటాడు. ఒకటేమిటి. సప్త సాలాలనూ ఒక్క బాణంతోనే భేదిస్తాడు రాముడు. ఆ బాణ మా వృక్షాల నవలీలగా చీలగొట్టి నేలలో దూరి మరలా వచ్చి తూణీరంలో చేరిపోతుంది. దానితో ఆశ్చర్యచకితుడై సుగ్రీవుడు పాదాల మీద వాలిపోతాడు. రాముడతణ్ణి గాఢాలింగనం చేసుకొని కిష్కంధకు వెళ్లి వాలిని యుద్దాని కాహ్వానించమని ఆదేశిస్తాడు. ఒకసారి యుద్ధంలో దెబ్బతింటాడు సుగ్రీవుడు. రాముణ్ణి ని ష్ఠుర మాడుతాడు రాముడంటాడు గదా. తతోహం రూపసాదృశ్యా న్మోహితః
Page 53